ఆ ఇద్దరు మిత్రులతో గోవా వెకేషన్ ఎంజాయ్ చేస్తున్న సింగర్ సునీత...అలాంటి వాళ్లకు బెస్ట్ డెస్టినేషన్ అట!

First Published Oct 1, 2021, 3:21 PM IST

పెళ్ళైన నాటి నుండి సింగర్ సునీత(Singer sunitha) ఓ కొత్త జీవితం అనుభవిస్తున్నారు. రామ్ తో సాంగత్యం ఆమె ఎంతగానో ఆస్వాదిస్తున్నట్లు ఆమె సోషల్ మీడియా పోస్ట్స్ ద్వారా తెలుస్తుంది. 

తాజాగా సునీత గోవా వెకేషన్ కి వెళ్లారు. అక్కడ మిత్రులతో కలిసి పచ్చని ప్రకృతి, సెలయేళ్ళు, అందమైన ప్రదేశాల్లో ఆహ్లాదంగా గడుపుతున్నారు. 

నాలా ప్రకృతిని ప్రేమించే వారికి గోవా మంచి డెస్టినేషన్, మిత్రులతో వెళ్ళినప్పుడు ఓ మంచి పిక్చర్ తీయమని వాళ్ళను డిమాండ్ చేయవచ్చని ఆమె కామెంట్ చేశారు. 

ఇక తన ఇంస్టాగ్రామ్ పోస్ట్ లో తన స్నేహితురాళ్ల పేర్లు కూడా మెన్షన్ చేశారు సునీత. పద్మజ, అన్నపూర్ణ అనే క్లోజ్ ఫ్రెండ్స్ తో గోవా ట్రిప్ కి సునీత వెళ్లినట్లు తెలుస్తుంది. 

మన జీవితాలను నిర్ణయించేది నిర్ణయాలే కాగా... రైట్ టైం లో రైట్ డెసిషన్ జీవితాన్ని మార్చి వేస్తుంది. అలాంటి నిర్ణయమే తీసుకున్నారు సింగర్ సునీత.

మొదటి భర్తతో విభేదాల కారణంగా విడిపోయిన సునీత చాలా కాలంగా పిల్లలతో కలిసి ఒంటరి జీవితం గడిపారు. ఈ క్రమంలో తన చిరకాల మిత్రుడు మ్యాంగో అధినేత రామ్, సునీతకు పెళ్లి ప్రపోజల్ పెట్టడం జరిగింది. 


రామ్ గురించి తెలిసిన సునీత అతనితో వివాహానికి ఒప్పుకున్నారు. పిల్లలతో పాటు తన భవిష్యత్ కోసం రెండో పెళ్లి నిర్ణయం తీసుకున్నట్లు సోషల్ మీడియా వేదికగా ఆమె తెలియజేశారు. 
 

2021 జనవరిలో సునీత రామ్ వివాహం ఘనంగా జరిగింది. చిత్ర ప్రముఖులతో పాటు రాజకీయవేత్తలు, సునీత మిత్రులు ఈ వివాహానికి హాజరయ్యారు. రామ్ కి అత్యంత సన్నిహితుడైన హీరో నితిన్ సతీసమేతంగా ఈ వేడుకలో పాల్గొన్నారు. 

ఒక దశలో సునీత ఆర్థిక ఇబ్బందులు కూడా ఎదుర్కొన్నారట. పిల్లల భవిష్యత్ గురించి ఆమె చాలా బాధపడ్డారట. ఇప్పుడు ఆమెకు అలాంటి చింత లేదు. పెళ్లి తరువాత ఆమె కెరీర్ కూడా ఊపందుకుంది. 
 


సింగర్ గానే కాకుండా పలు టీవీ కార్యక్రమాల్లో ఆమె జడ్జిగా కనిపిస్తున్నారు. ఐకానిక్ మ్యూజిక్ షో పాడుతా తీయగా కొత్త సీజన్ కి సునీత జడ్జిగా వ్యవహరించనున్నారు. ఈ షోలో బాలుగారి కుమారుడైన ఎస్పీ చరణ్ సైతం మరో జడ్జిగా పాల్గొనడం విశేషం. 

తాజాగా సునీత గోవా వెకేషన్ కి వెళ్లారు. అక్కడ మిత్రులతో కలిసి పచ్చని ప్రకృతి, సెలయేళ్ళు, అందమైన ప్రదేశాల్లో ఆహ్లాదంగా గడుపుతున్నారు. 

click me!