పవన్ ని కలసిన వారిలో దిల్ రాజు, డివివి దానయ్య, మైత్రి సంస్థ నవీన్, బన్నీ వాసు, వంశీ రెడ్డి, సునీల్ నారంగ్ లు ఉన్నారు. పండుగ సీజన్ దగ్గర పడుతుండడంతో టాలీవుడ్ లో భారీ చిత్రాలు రిలీజ్ కు రెడీ అవుతున్నాయి. కాబట్టి త్వరగా ప్రభుత్వం తమ సమస్యలని పరిష్కరించాలని దిల్ రాజు పేర్ని నాని ముందు వ్యాఖ్యానించారు. మరి ఏపీ ప్రభుత్వం ఈ విషయంలో ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందో వేచి చూడాలి.