రెండో పెళ్లిపై ట్రోలింగ్.. సంస్కారం ఉన్నవాళ్లు ఇలా మాట్లాడతారా.. సింగర్ సునీత ఎమోషనల్..

First Published Sep 17, 2022, 4:28 PM IST

తన మధుర గాత్రంతో సింగర్ సునీత ఎందరో అభిమానులని సొంతం చేసుకుంది. సింగర్ గా, డబ్బింగ్ ఆర్టిస్ట్ గా సునీత టాలీవుడ్ లో దూసుకుపోతున్నారు. సునీత తన మొదటి భర్త నుంచి విడిపోయి చాలా కాలం సింగిల్ గా ఉన్నారు.

తన మధుర గాత్రంతో సింగర్ సునీత ఎందరో అభిమానులని సొంతం చేసుకుంది. సింగర్ గా, డబ్బింగ్ ఆర్టిస్ట్ గా సునీత టాలీవుడ్ లో దూసుకుపోతున్నారు. సునీత తన మొదటి భర్త నుంచి విడిపోయి చాలా కాలం సింగిల్ గా ఉన్నారు. అయితే సునీత గత ఏడాది రెండో వివాహం చేసుకున్న సంగతి తెలిసిందే. రామ్ వీరపనేని అనే వ్యాపార వేత్తని వివాహం చేసుకుని సంతోషంగా గడుపుతోంది. 

సునీత ఎక్కువగా తన పర్సనల్ లైఫ్ విషయాలతో వార్తల్లో ఉంటున్నారు. సునీత వ్యక్తిగత విషయం ప్రస్తావనకు వచ్చినప్పుడల్లా ఆమె రెండో వివాహం గురించి చర్చ జరుగుతోంది. తాజాగా ఇంటర్వ్యూలో తనని ట్రోలింగ్ చేసే వారిపై ఫైర్ అవుతూ ఎమోషనల్ అయ్యారు. 

తాను జీవితంలో ఎన్నో కష్టాలు అనుభవించినట్లు సునీత తెలిపారు. ఒంటరిగా తానే పిల్లల్ని పెంచినట్లు పేర్కొన్నారు. నా లైఫ్ కి దివంగత బాలసుబ్రమణ్యం గారు మెంటర్ గా ఉండేవారు. నేను డిప్రెషన్ లో ఉన్నప్పుడు నన్ను మామూలు మనిషిని చేసింది ఆయనే. 

ఈ ఇంటర్వ్యూలో యాంకర్ సునీత రెండవ వివాహం గురించి ప్రస్తావించారు. మీ రెండో పెళ్లిపై జరుగుతున్న ట్రోలింగ్ గురించి ఏం చెబుతారు అని ప్రశ్నించగా సునీత సీరియస్ అయ్యారు. నేను గాయనిగా గుర్తింపు తెచ్చుకున్నాను. ఇప్పటివరకు 120 మంది హీరోయిన్లకు డబ్బింగ్ చెప్పాను. సినిమాతో ఇంతలా వినోదాన్ని పంచుతున్నాను. 

నాలో ఇన్ని మంచి విషయాలు ఉండగా నా పర్సనల్ లైఫ్ గురించే ఎందుకు మాట్లాడతారు. సంస్కారవంతులు ఎవరూ వ్యక్తిగత విషయాల గురించి మాట్లాడరు అని సునీత ఫైర్ అయ్యారు. 

సునీత తెలుగులో వందలాది పాటలకు తన మధుర గాత్రాన్ని అందించారు. అచ్చతెలుగులో ఎంతో అందంగా స్పష్టంగా మాట్లాడగలగడం సునీత ప్రత్యేకత. అందుకే ఆమె డబ్బింగ్ ఆర్టిస్ట్ గా కూడా సక్సెస్ అయ్యారు. 

click me!