సునీత కేవలం గాయని మాత్రమే కాదు, యాంకర్ గా, డబ్బింగ్ ఆర్టిస్ట్ గా కూడా పాపులర్ అయ్యారు. సౌందర్య, రాశి, త్రిష, కత్రినా కైఫ్, స్నేహ, కమలినీ ముఖర్జీ లాంటి క్రేజీ హీరోయిన్లందరికీ సునీత డబ్బింగ్ చెప్పారు. సునీత టాలీవుడ్ లోకి గులాబీ చిత్రంతో సింగర్ గా అడుగుపెట్టారు. ఆ చిత్రంలో సునీత పాడిన 'ఈ వేళలో నీవు' అనే సాంగ్ సూపర్ హిట్ అయింది. దీనితో ఒక్కసారిగా సునీత క్రేజీ సింగర్ గా మారిపోయారు.