శింబు కోసం ఆ సూపర్‌హిట్‌ సాంగ్‌ని మగ గొంతుతో పాడిన ఎస్‌ జానకి

First Published Oct 9, 2024, 2:35 PM IST

తెలుగు చిత్ర పరిశ్రమలో అనేక సూపర్ హిట్ పాటలు పాడిన గాయని జానకి, శింబు కోసం పురుష గాత్రంలో పాడిన పాట  గురించి ఆసక్తికర విషయాలను తెలుసుకుందాం. 

సింబు, జానకి

తెలుగు సినిమాలో గాయని జానకి తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకోవడానికి ఆమె బహుముఖ ప్రజ్ఞ కూడా ఒక కారణం. తన గొంతును ఎలా అయినా మార్చుకుని పాడటంలో ఆమె దిట్ట. 60 ఏళ్ల బామ్మ నుండి 6 ఏళ్ల చిన్నారి వరకు, వారికి తగ్గట్టుగా అనేక సినిమాల్లో తన గొంతును మార్చుకుని పాడింది. అలా శింబు కోసం జానకి పురుష గాత్రంలో పాట పాడిందనే ఇంట్రెస్టింగ్‌ విషయం గురించి చూస్తే, 

బిగ్‌ బాస్‌ తెలుగు 8 ఇంట్రెస్టింగ్ అప్‌ డేట్స్ కోసం ఇక్కడ క్లిక్‌ చేయండి.

గాయని జానకి

దర్శక, నిర్మాత టి.రాజేందర్ తన కుమారుడు సిలంబరసన్‌ను చిన్నప్పటి నుంచే నటింపజేస్తున్నారు. అలా 1989లో విడువైన ‘సంసార సంగీతం’ చిత్రంలో టి.రాజేందర్‌తో కలిసి ఆయన కుమారుడు సింబు కూడా నటించాడు. ఈ చిత్రానికి సంగీతం కూడా టి.రాజేందర్ అందించారు. తన కుమారుడి కోసమే ఆయన ప్రత్యేక శ్రద్ధతో  ‘ఐ యామ్ ఏ లిటిల్ స్టార్’ పాటను కంపోజ్ చేశారు. ఆ పాటలో ‘ఐ యామ్ ఏ లిటిల్ స్టార్... ఆవే నేను సూపర్ స్టార్’ అంటూ చిన్న పిల్లవాడి గొంతుతో చాలా అందంగా పాడినట్లు వినిపిస్తుంది.

Latest Videos


సంసార సంగీతం సినిమా పాట

సింబు కోసం ఆ పాట పాడింది మరెవరో కాదు, గాయని జానకి తన గొంతును మార్చుకుని చిన్న పిల్లవాడిలా పాడి అందరినీ ఆశ్చర్యపరిచింది. అది కూడా పురుష గాత్రంలో ఆమె పాడిన ఈ పాట అన్ని వర్గాల ప్రజలను అలరించింది. సింబుకు ఒక గుర్తింపు తీసుకొచ్చిన పాటగా కూడా ఇది నిలిచింది. సింబుతో పాటు బాలనటిగా నటించిన షాలిని సినిమాలకు కూడా గాయని ఎస్.జానకి చిన్న పిల్లల గొంతుతో పాడి అలరించింది.

అంతేకాదు, 1981లో విడుదలైన భాగ్యరాజ్ నటించిన ‘మౌన గీతంగ’ల్ చిత్రంలోని ‘డాడీ డాడీ ఓ మై డాడీ’ అనే పాట సూపర్ హిట్ అయింది. చిన్న పిల్లాడు పాడుతున్నట్లుగా అనిపించినా ఈ పాటను పాడింది కూడా జానకి. అంతేకాదు, ‘రంగ’ సినిమాలో రజనీకాంత్‌తో కలిసి నటించిన చిన్న పిల్లాడు పాడే ‘పేస్ట్ ఉంది బ్రష్ ఉంది లేవండి మామా’ పాట కూడా జానకి తన గొంతును మార్చుకుని పాడినదే. ఇలా జానకి తన ప్రతిభను చాటుకున్న సినిమాలు కోకొల్లలు. అందుకే ఆమె పాటలు కాలాన్ని దాటి నిలిచిపోతున్నాయి.
 

ప్రస్తుతం శింబు హీరోగా బిజీగా ఉన్నాడు. ఆయన కమల్‌ హాసన్‌ హీరోగా రూపొందుతున్న `దగ్‌ లైఫ్‌` మూవీలో కీలక పాత్రలో మెరుస్తున్నారు. దీనికి మణిరత్నం దర్శకత్వం వహిస్తున్నారు. దీంతోపాటు సోలో హీరోగా మరో సినిమా చేస్తున్నారు. ఇందులో ఆయన ద్విపాత్రాభినయం చేస్తున్నారు. `సిలాంబట్టం`, `మన్మథన్‌` చిత్రాల్లో ద్విపాత్రాభినయం చేసిన విషయం తెలిసిందే. ఇక `అన్బనవన్‌ అసరథవన్‌ అడంగధవన్‌` చిత్రంలో మూడు పాత్రలు చేసి మెప్పించారు. 

click me!