ఒకప్పుడు సౌత్ ఇండస్ట్రీని ఏలిన నటి సిమ్రాన్, ప్రేక్షకులకు హాట్ ఫేవరెట్. బాలీవుడ్తోనే ఎంట్రీ ఇచ్చినా.. తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ చిత్రాల్లోనే ఆమె ఎక్కువగా రాణించింది. తాజాగా బాలీవుడ్లో తనకు ఎదురైన అవమానాలపై ఆమె మాట్లాడింది.
బాలీవుడ్లో సౌత్ నటులకు సరైన గౌరవం ఇవ్వరని సిమ్రాన్ సంచలన కామెంట్స్ చేసింది. హోటల్, ఫ్లైట్ టికెట్ల విషయంలో కూడా బేరాలాడతారని, తన సిబ్బంది సంఖ్యపై కూడా పరిమితులు విధించారని ఓ ఇంటర్వ్యూలో తెలిపింది.
25
ప్రేక్షకుల హాట్ ఫేవరెట్
ఒకప్పుడు సౌత్ ఇండియాను ఏలిన సిమ్రాన్, ప్రేక్షకులకు హాట్ ఫేవరెట్. బాలీవుడ్తో కెరీర్ మొదలుపెట్టినా.. తెలుగు, తమిళ, కన్నడ, మలయాళంలోనే ఆమె ఎక్కువగా యాక్ట్ చేసింది. ఇప్పుడు బాలీవుడ్లో ఎక్కువ సినిమాలు ఎందుకు చేయలేదో చెప్పింది.
35
గౌరవం దక్కలేదు
బాలీవుడ్లో తనకు సరైన గౌరవం దక్కలేదని సిమ్రాన్ డైరెక్ట్ గా చెప్పేసింది. హోటల్, ఫ్లైట్ టికెట్ల విషయంలో నిర్మాతలు బేరసారాలు చేసేవారని 'ఫిల్మ్ఫేర్' ఇంటర్వ్యూలో తన ఆవేదనను బయటపెట్టింది.
నాకు అక్కడ చాలా చెడ్డ అనుభవాలు ఎదురయ్యాయి. వాళ్లతో నేను ఇమడలేకపోయాను. మనం సౌత్లో చేసిన పనిని వాళ్లు చూడరు. మన నేపథ్యం, మన విజయాలు వాళ్లకు తెలియవు. ఈ విషయం నన్ను చాలా బాధపెట్టింది. నా జీవితంలో సగం సినిమాకే ఇచ్చాను. అయినా గౌరవం దక్కనప్పుడు మనసులో చాలా పెయిన్ ఉంటుంది అని సిమ్రాన్ చెప్పింది.
55
చిరాకు తెప్పించింది
హోటల్ విషయంలో బేరాలాడతారు. నాతో వచ్చే సిబ్బంది సంఖ్యపై పరిమితులు పెడతారు. 'మీరు ఇంతమంది స్టాఫ్ను తీసుకురావద్దు' అని చెబుతారు. ఇవన్నీ నాకు చిరాకు తెప్పించాయి. అక్కడో రకమైన పవర్ గేమ్ నడుస్తుంది. అందుకే పని చేయాలనిపించదు, చాలా బాధగా ఉంటుంది అని సిమ్రాన్ వివరించింది.