దీపావళి కానుకగా నవంబర్ లో ఈ చిత్రాన్ని రిలీజ్ చేయాలనుకున్నారు. కానీ రజనీకాంత్ 'అన్నాత్తే' కూడా అదే టైంలో విడుదలవుతోంది. విశాల్ ' ఎనిమి' కూడా అదే టైంలో రిలీజవుతోంది. దీనితో శింబు చిత్రాన్ని పోస్ట్ పోన్ చేయాలని నిర్మాతలు నిర్ణయించారు. దీనికి శింబు తల్లిదండ్రులు అంగీకరించడం లేదు. శింబు వెనుక పెద్ద కుట్ర జరుగుతోంది అంటూ శింబు తల్లిదండ్రులు టి రాజేందర్, ఉషా రాజేందర్ బుధవారం మీడియా ముందుకు వచ్చారు.