Chiraiya Series: 'చిరాయ'లో శోభనం రాత్రి సీన్.. నటిస్తూ కుప్పకూలిన నటుడు!

Published : Apr 06, 2026, 06:01 PM IST

ప్రస్తుతం జియో హాట్‌స్టార్‌లో శశాంత్ షా రూపొందించిన చిరాయ వెబ్ సిరీస్ ట్రెండింగ్‌లో ఉంది. మార్చి 20న స్ట్రీమింగ్ మొదలైన ఈ సిరీస్‌లో కొన్ని సీన్లు ఎంత భయంకరంగా ఉన్నాయంటే.. వాటిని షూట్ చేస్తున్నప్పుడు నటుడు తట్టుకోలేకపోయాడు. 

PREV
15
జియో హాట్‌స్టార్ వెబ్ సిరీస్ చిరాయ

జియో హాట్‌స్టార్‌లో వచ్చిన 'చిరాయ' వెబ్ సిరీస్‌లో మొత్తం 6 ఎపిసోడ్లు ఉన్నాయి. ఇందులో దివ్యా దత్తా, సంజయ్ మిశ్రా, సిద్ధార్థ్ షా, ప్రసన్నా బిస్త్ ప్రధాన పాత్రలు పోషించారు. ఇది 'సంపూర్ణ' అనే బెంగాలీ వెబ్ సిరీస్‌కు అడాప్షన్. దీనిని దివ్య నిధి శర్మ రాశారు.

25
వెబ్ సిరీస్ చిరాయలో శోభనం రాత్రి సీన్

ఈ సిరీస్‌లో హీరోయిన్‌గా నటించిన ప్రసన్నా బిస్త్ ఇటీవల ఓ ఇంటర్వ్యూలో శోభనం రాత్రి సీన్ గురించి కొన్ని షాకింగ్ విషయాలు చెప్పింది. ఆ సీన్ షూట్ చేయడం నటుడు సిద్ధార్థ్ షాకు చాలా కష్టంగా అనిపించిందని, సెట్‌లోనే ఏడ్చేశాడని ఆమె వెల్లడించింది. 

35
మధ్యలోనే ఆగిపోయిన 'చిరాయ' షూటింగ్
ప్రసన్నా బిస్త్ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. 'ఆ సీన్ గుండెల్ని పిండేసేలా ఉంటుంది. శోభనం రాత్రి భర్త అరుణ్ (సిద్ధార్థ్), భార్య పూజ (ప్రసన్న)ను బలవంతం చేస్తాడు. ఆ సీన్ షూట్ చేస్తున్నప్పుడు సిద్ధార్థ్ తనను తాను కంట్రోల్ చేసుకోలేకపోయాడు. దీంతో షూటింగ్‌ను మధ్యలోనే ఆపాల్సి వచ్చింది' అని చెప్పింది.
45
చిరాయ సీన్ కోసం రిహార్సల్స్
ప్రసన్న ఆ సీన్ గురించి వివరిస్తూ.. 'షూటింగ్ సమయంలో పూర్తి భద్రతా చర్యలు తీసుకున్నారు. సీన్ చేయడానికి ముందు బాగా రిహార్సల్స్ చేశాం. ప్రతీ స్టెప్ ముందే ఫిక్స్ చేసుకున్న ఓ డ్యాన్స్ కొరియోగ్రఫీలా చేశాం. మేమిద్దరం ఐదేళ్లుగా ఒకరికొకరం తెలుసు, చాలా కంఫర్టబుల్‌గా ఉంటాం. కానీ కెమెరా ఆన్ అవ్వగానే సిద్ధార్థ్ వణికిపోయాడు. చాలా కష్టంగా ఆ సీన్ పూర్తిచేశాం' అని తెలిపింది.
55
చిరాయ నటుడు సిద్ధార్థ్ షాపై విమర్శలు

ఇంటర్వ్యూలో ప్రసన్న మాట్లాడుతూ.. 'సిరీస్‌లో నెగెటివ్ పాత్ర పోషించినందుకు సిద్ధార్థ్ షా చాలా విమర్శలు ఎదుర్కొంటున్నాడు. సిరీస్ చూసిన వాళ్లు అతన్ని ద్వేషిస్తున్నారు. అయితే, అదంతా కేవలం తెరపై నటన మాత్రమే, నిజ జీవితానికి సంబంధం లేదు' అని స్పష్టం చేసింది. 

Read more Photos on
click me!

Recommended Stories