Shruti Haasan: ఉల్లిపొరలాంటి బ్లాక్‌ శారీలో నడుము అందాలతో రచ్చ.. వీరసింహారెడ్డి ఈవెంట్‌లో స్పెషల్‌ ఎట్రాక్షన్

First Published Jan 6, 2023, 9:10 PM IST

శృతి హాసన్‌.. బ్లాక్‌ లుక్‌లో అదరగొడుతుంది. తరచూ ఆమె ఇన్‌స్టాగ్రామ్‌లో బ్లాక్‌ షేడ్‌ ఫోటోలు పంచుకుని ఆకట్టుకుంటుంది. తాజాగా `వీరసింహారెడ్డి` ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌లో బ్లాక్‌ శారీలో పిచ్చెక్కిస్తుంది.

శృతి హాసన్‌ `వీరసింహారెడ్డి` చిత్రంలో హీరోయిన్‌గా నటిస్తుంది. ఈ సినిమా ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌ ఒంగోల్‌లో గ్రాండ్‌గా జరుగుతుంది. ఇందులో శృతి స్పెషల్‌ ఎట్రాక్షన్‌గా నిలిచింది. బ్లాక్‌ శారీలో మెరిసింది శృతి. అందరి చూపులను తనవైపు తిప్పుకుంది.
 

ఉల్లిపొరలాంటి శారీలో తన అందాలను ఫిల్టర్ లేకుండా చూపించి ఆకట్టుకుంటుంది. ఈవెంట్‌కే గ్లామర్‌ తీసుకొచ్చింది. ఈవెంట్‌ని కలర్‌ఫుల్‌గా మార్చేసింది. చిలిపి నవ్వులతో ఆద్యంతం కట్టిపడేసింది శృతి హాసన్‌. 
 

బ్లాక్‌ శారీలో శృతి అందాల మరింత హాట్‌గా మారిపోయాయి. ఘాటు రేపుతున్నాయని చెప్పొచ్చు. `వీరసింహారెడ్డి` ఈవెంట్‌లో అందరి చూపులను తనవైపు తిప్పుకుని నందమూరి అభిమానుల మనసులను దోచుకుంది. 
 

ఈవెంట్‌లో ఆమె గురించి రైటర్‌ బుర్రసాయిమాధవ్‌ మాట్లాడుతూ తండ్రి కమల్‌ లోని కామెడీ టైమింగ్‌ని వంటబట్టించుకుందని తెలిపారు. అంతేకాదు ఎన్టీఆర్‌ జీన్స్ ని, కమల్ జీన్స్ ని కలగలిపితే ఎలా ఉంటుందో శృతి అలా ఉంటుందని తెలిపింది. ఆమె ఇందులో తనలోని మరో యాంగిల్‌ని చూపించిందని, వెండితెరపై రచ్చ చేసిందని చెప్పారు.

ఇక మొదటిసారి బాలకృష్ణతో కలిసి నటించింది శృతి హాసన్. సీనియర్‌ హీరోలతో కలిసి నటించడం కూడా తొలి సారి. ఓ వైపు చిరంజీవితో, మరోవైపు బాలయ్యతో బ్యాక్ టూ బ్యాక్ సినిమాలు చేసింది. ఈ సంక్రాంతికి ఈ రెండు సాంగ్స్ విడుదల అవుతుండటం విశేషం. 

ఈ సంక్రాంతికి సందడంతా శృతి హాసన్‌ దే అనేట్టుగా మారిపోయింది. ఒక్క రోజు గ్యాప్‌తో ఈ రెండు చిత్రాలు విడుదల కాబోతున్నాయి. ఇలా అటు నందమూరి అభిమానులను, ఇటు మెగా అభిమానులను అలరించబోతుంది. 

మరోవైపు ప్రభాస్ తో పాన్‌ ఇండియా మూవీ `సలార్‌`లోనూ నటిస్తుంది. ఇందులో ఆమె పవర్‌ఫుల్‌ రోల్‌ చేస్తుందని సమాచారం. హీరోయిన్‌గా గ్లామరస్‌గానే కాదు, నటన పరంగానూ కట్టిపడేస్తుందని తెలుస్తుంది. 
 

ఏదేమైనా ప్రస్తుతం శృతి హాసన్‌ `వీరసింహారెడ్డి` చిత్ర ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌లో హైలైట్‌గా నిలుస్తుంది. బ్లాక్‌ శారీలో మైండ్‌ బ్లాక్‌ చేస్తుంది. నందమూరి ఫ్యాన్స్ కి కనువిందుని ఇస్తుంది. 
 

ఈ ఈవెంట్‌లో శృతి హాసన్‌ మాట్లాడుతూ, గోపీచంద్‌తో మూడో సినిమా చేస్తున్నా అని, మంచి ఆఫర్లు ఇచ్చారని తెలిపింది. టాలీవుడ్‌లో తనకు ఆయన ఒక అన్నయ్య లాంటి వారిని అని చెప్పింది. బాలయ్య గురించి చెబుతూ, ఆయన్ని గాడ్‌ ఆఫ్‌ మాసెస్‌ అంటారు. కానీ ఆయనలో చాలా కూల్‌ పర్సన్‌ ఉన్నారని ఓ రోజు పబ్‌లో చూశానని తెలిపింది. ఆయనతో పనిచేయడం ఆనందంగా ఉందని చెప్పింది. జై బాలయ్య అంటూ నినాదం చేసి అదరగొట్టింది. అంతేకాదు చివరగా డాన్సు చేసి మరింత రచ్చ చేసింది. 

click me!