టాలీవుడ్ యంగ్ హీరోయిన్ షాలినీ పాండే తొలి చిత్రంతోనే సెన్సేషన్ క్రియేట్ చేసింది. బోల్డ్ పెర్ఫామెన్స్ తో యూత్ లో కుర్రకారును కట్టిపడేసింది. నటన, గ్లామర్ పరంగా తన మొదటి చిత్రం ‘అర్జున్ రెడ్డి’తో అలరించింది. ఈ చిత్రం బ్లాక్ బాస్టర్ హిట్ కావడంతో షాలినీకి ఓవర్ నైట్ స్టార్ డమ్ దక్కింది.
ఈ చిత్రంలో సెన్సేషనల్ స్టార్ విజయ్ దేవరకొండ (Vijay Deverakonda) సరసన నటించింది. వీరిద్దరి కెమిస్ట్రీ, రొమాన్స్ ఆడియెన్స్ ను కూడా కట్టిపడేసింది. చాలా నేచురల్ గా నటించడంతో వీరికి యూత్ లో మంచి క్రేజ్ కూడా దక్కింది. ఇక విజయ్ ఏస్థాయికి వెళ్లాడో తెలిసిందే. షాలినీ కూడా ప్రస్తుతం తన కేరీర్ లో దూసుకెళ్తోంది.
సినిమాల పరంగానే కాకుండా, షాలినీ తన అభిమానులకు సోషల్ మీడియా ద్వారా కూడా దగ్గరగా ఉంటోంది. తన వ్యక్తిగత విషయాలతో పాటు సినిమా విషయాలను కూడా పంచుకుంటోంది. తాజాగా ఈ బ్యూటీ ‘సైమా అవార్డ్స్ 2022’ ఫంక్షన్ కోసం అదిరిపోయే అవుట్ ఫిట్ ను ధరించింది. ఈ సందర్భంగా మతిపోయేలా ఫొటోషూట్ చేసింది.
ఆ గ్లామర్ పిక్స్ ను షాలినీ తాజాగా సోషల్ మీడియాలో అభిమానులతో పంచుకుంది. స్ల్పిటెడ్ టైట్ ఫిట్ లో షాలినీ చుట్టు కొలతలు చూపించింది. స్టన్నింగ్ స్టిల్స్ తో స్లిమ్ ఫిట్ అందాలను విందు చేసింది. మత్తెక్కించే చూపులతో కుర్రాళ్లను మంత్రముగ్ధులను చేసింది. టాప్ గ్లామర్ షోతో కట్టిపడేసింది.
సౌత్ సినిమాలకు సంబంధించిన సైమా అవార్డ్స్ 2022 (Siima2022) ఫంక్షన్ ను బెంగళూరులో రెండు రోజుల పాటు నిర్వహించారు. ఈ సందర్భంగా షాలినీ కూడా ఈవెంట్ లో దర్శనమిచ్చి అట్రాక్ట్ చేసింది. అందరి చూపు తనపైనే పడేలా చేసింది. తను పంచుకున్న ఫొటోలు ప్రస్తుతం ఇంటర్నెట్ లో వైరల్ అవుతున్నాయి.
ఇక కేరీర్ విషయానికొస్తే.. టాలీవుడ్ లో సెన్సేషనల్ క్రియేట్ చేసిన షాలినీ పాండే ప్రస్తుతం హిందీ చిత్రాల్లోనే ఎక్కువ నటిస్తోంది. గత కొంత కాలం తెలుగు సినిమాల్లో ఈ బ్యూటీకి కలిసి రాకపోవడంతో నార్త్ ఆడియెన్స్ కు దగ్గరయ్యేందుకు హిందీ చిత్రాల్లోనే నటిస్తోంది. చివరిగా రణవీర్ సింగ్ నటించిన ‘జయేష్ బాయ్ జోర్దార్’తో అలరించింది. ప్రస్తుతం ‘మహారాజా’ మూవీలో నటిస్తోంది.