తమ మధ్య కొందరు చిచ్చుపెట్టారని, రమా ప్రభ ఆయన్ని చేసుకుందని చాలా మంది నటీనటులు ఈర్ష్యా చెందారని, అబ్బాయిలు తనమీద, అమ్మాయిలు శరత్బాబుపై ప్రేమని చూపించేవారని, ఈ క్రమంలో కొందరు తోటీ నటీమణులే కుట్రలు చేశారని, గొడవలకు కారణమయ్యారని తెలిపింది. అంతేకాదు తామిద్దరం విడిపోయే సమయంలో డబ్బు అంతా పోయిందని, అయితే అదంతా ప్లాన్ ప్రకారమే జరిగిందని, లోపల కుట్రలు చేశారని, ఆ విషయం తెలియక తాను ఆస్తులు రాసిచ్చేశారని, చాలా కోల్పోయినట్టు చెప్పింది రమా ప్రభ. ఆ తర్వాత వాళ్లు ఆ కుట్రల ఫలితాలను అనుభవించారని వెల్లడించింది.