రాజేంద్రప్రసాద్‌ ‘శాసనసభ’ మూవీ రివ్యూ!

First Published Dec 17, 2022, 1:48 PM IST

పొలిటికల్ థ్రిల్లర్ గా ప్రేక్షకుల ముందుకు వచ్చిన తాజా చిత్రం ‘శాసనసభ’ (Sasanasabha). ఇంద్రసేన, సీనియర్ నటుడు డాక్టర్ రాజేంద్ర ప్రసాద్, ఐశ్వర్వ రాజ్ ప్రధాన పాత్రల్లో నటించారు. వేణు మండికంటి దర్శకత్వం వహించారు. సినిమా ఎలా ఉందనేది రివ్యూలో తెలుసుకుందాం..
 

ప్రస్తుతం చిన్న సినిమా.. పెద్ద సినిమా అనే కోణం ప్రేక్షకుల్లో లేదు. కథ నచ్చితే బ్రహ్మరథం పట్టేస్తున్నారు. 2022లో ఆయా చిత్రాలతో ఇది స్పష్టం అయ్యింది. ఇక ఈ శుక్రవారం థియేటర్లలోకి వచ్చిన చిత్రాల్లో ‘శాసనసభ’ ఒకటి.  పొటిలికల్ థ్రిల్లర్ గా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. చిత్రంలో ఇంద్రసేన ప్రధాన పాత్రలో నటించారు. నటకిరీటీ, సీనియర్ నటుడు  డాక్టర్ రాజేంద్ర ప్రసాద్ కీలక పాత్రను పోషించారు. హీరోయిన్ గా ఐశ్వర్య రాజ్ బకుని నటించింది. సోనియా అగర్వాల్, హేబా పటేల్ ఆయా రోల్స్ లో మెరిశారు. వేణు మడికంటి దర్శకత్వం వహించగా కథ, స్క్రీన్ ప్లే, డైలాగ్స్ రాఘవేంద్రరెడ్డి అందించారు. మ్యూజిక్ సెన్సేషన్ రవి బసూర్ సంగీతం అందించారు. తులసీరామ్ సాప్పని, షణ్ముగం సాప్పని నిర్మించారు. డిసెంబర్ 16న గ్రాండ్ గా థియేటర్లలో విడుదలైంది. 
 

కథ : పొలిటికల్ బ్యాక్‌డ్రాప్‌లో కల్పిత రాష్ట్రంలో ఈ సినిమా తెరకెక్కింది. ఆ ఫిక్షనల్ స్టేల్ లో ఎలక్షన్స్ జరగ్గా..  ఏ ఒక్క పార్టీకి పూర్తి మెజారిటీ రాదు. దీంతో హంగ్ ఏర్పడుతుంది. ఎట్టి పరిస్థితుల్లో తమ ప్రభుత్వమే రావాలని అప్పటికే సీఎంగా ఉన్న అనీష్ కురువిల్లా ప్రయత్నిస్తారు. మరోవైపు తానే ముఖ్యమంత్రి కావాలని ప్రతిపక్ష పార్టీ నాయకురాలు సోనియా అగర్వాల్ వ్యూహాలు రచిస్తుంటుంది. హంగ్ ఏర్పడి సమయంలో ప్రభుత్వ ఏర్పాటుకు స్వతంత్ర ఎమ్మెల్యేలే కీలకం. వారిని తమవైపు తిప్పుకునేందుకు  డీల్ కుదర్చడంలో ప్రభావవంతమైన రాజకీయ వ్యక్తి దుర్గా (అమిత్ తివారీ) ఒక వర్గానికి బలంగానూ.. మరో వర్గానికి బలహీనంగా మారుతాడు. దీంతో చంపాలని ఒకరు.. కాపాడాలని మరొకరు ప్రయత్నిస్తారు. ఈ క్రమంలో దుర్గాపై హత్యా దాడి జరగడంతో జైలులో ఉన్న సూర్య (ఇంద్ర సేన) దుర్గను రక్షిస్తాడు. దీంతో సూర్య, దుర్గతో కలిసిపోతాడు. వీరిద్దరూ కలిశాక ఏం చేశారు? ఇంతకీ సూర్య దుర్గతో ఎందు కలిశాడు? ఏ పార్టీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది? సీఎం ఎవరు? అనేది మిగితా కథ..
 

కథనం :

శాసనసభ గొప్పతనాన్ని తెలియజేసిదిగా సినిమా కథనం సాగింది. పొలిటికల్ థ్రిల్లర్ డ్రామాకు జర్నలిస్ట్ గా, శాటిలైట్ కన్సల్టెంట్ గా ఎంతో అనుభవం ఉన్న రాఘవేంద్ర రెడ్డి  తనదైన శైలిలో ఆసక్తికరమైన కథను అందించారు. ఎంచుకున్న కథ బాగానే ఉందని చెప్పాలి. అయితే సరిగ్గా డీల్ చేస్తే పొలిటికల్ బ్యాక్ డ్రాప్ సినిమాలు కూడా సక్సెస్ అందుకుంటాయి. కానీ దర్శకత్వంలో కాస్తా లోపం కనిపిస్తోంది. ఫస్టాఫ్ ఇంట్రెస్టింగ్ గా సాగుతుంది. కొన్నికొన్ని సాగదీతలూ ఉన్నాయి. ఫస్టాఫ్ తో పోల్చితే సెకండాఫ్ పై అంచనాలు పెంచి నిరాశ పరిచారు. క్లైమాక్స్ తో పాటు మిగిలిన కథాంశం రోటీన్ గా సాగిపోతుంది.

బలాలు, బలహీనతలు : ప్రస్తుతం రాజకీయ అంశాలను కళ్లకు కట్టినట్టు చూపించారు. వాటి ద్వారా భవిష్యత్ లో ఎలాంటి నష్టాలు చేకూరుతాయని తెలిపారు. రాఘవేంద్రరెడ్డి రాసిన డైలాగ్స్ సినిమా కథకు బలాన్ని చేకూర్చాయి. దర్శకత్వం మరింత బాగుంటే సినిమా వేరే లెవల్. చిత్రానికి ‘కేజీఎఫ్’ సంగీత దర్శకుడు రవి బస్రూర్ తన మార్క్ మ్యూజిక్ అందించారు. టెక్నీకల్ టీం కూడా పర్వాలేదనిపించింది. కాస్తా గ్రాఫిక్ వర్క్ మెరుగ్గా ఉంటే బాగుండనిపించింది. నిర్మాణ విలువలు, సినిమాటోగ్రఫీ బాగుంది. 

నటీనటులు : ప్రధాన పాత్రలో నటించిన ఇంద్రసేన ప్రేక్షకులను ఆకట్టుకుంటుంది. యాక్షన్ సీక్వెల్స్, పలు ఆసక్తిపెంచే సన్నివేశాల్లో ఈయన నటన ప్రభావం కనిపిస్తుంది. నటకిరిటీ రాజేంద్ర ప్రసాద్ మరోసారి అద్భుతమైన పెర్ఫామెన్స్ ను అందించారు. అలాగే సోనియా అగర్వాల్, అజిహ్వర్య రాజ్ లు తమతమ పాత్రల్లో చక్కగా ఒదిగిపోయారు. హేబా పటేల్ స్పెషల్ సాంగ్ లో తన బ్యూటీతో అలరించింది. 

click me!