హరియాణాకు చెందిన ప్రముఖ సింగర్, డ్యాన్సర్ సప్నా చౌదరి తన భర్త వీర్ సాహుపై గృహ హింస ఆరోపణలు చేసింది. ఈ మేరకు ఆమె ఢిల్లీ కోర్టును ఆశ్రయించింది. ఈ కేసు ఇప్పుడు పెద్ద వార్తగా మారడంతో, అసలు వీర్ సాహు ఎవరు అని అందరూ ఆసక్తిగా తెలుసుకుంటున్నారు.
సప్నా చౌదరి హరియాణాలో చాలా ఫేమస్ డ్యాన్సర్, సింగర్. తన స్టేజ్ పెర్ఫార్మెన్స్లతో ఆమెకు మంచి పేరు వచ్చింది. ఆ తర్వాత 'బిగ్ బాస్ 11' రియాలిటీ షోలో పాల్గొనడంతో దేశవ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకుంది. ఎన్నో మ్యూజిక్ వీడియోలు, సినిమాలు, టీవీ షోలలో కూడా సప్నా కనిపించింది.
25
భర్త వేధింపులు
ప్రముఖ హరియాణీ సింగర్, డ్యాన్సర్ సప్నా చౌదరి తన భర్త వీర్ సాహు తనను వేధిస్తున్నాడని ఆరోపిస్తూ ఢిల్లీ కోర్టును ఆశ్రయించింది. గృహ హింస చట్టం కింద తనకు రక్షణ కల్పించాలని కోరింది. ఆమె పిటిషన్ను పరిశీలించిన కోర్టు, తదుపరి విచారణ వరకు ఆమెకు రక్షణ కల్పిస్తూ ఆదేశాలు జారీ చేసింది.
35
భర్తపై సప్నా చౌదరి ఆరోపణలు
పెళ్లి అయినప్పటి నుంచి తన భర్త శారీరకంగా, మానసికంగా హింసిస్తున్నాడని సప్నా తన పిటిషన్లో పేర్కొంది. బహిరంగ ప్రదేశాల్లో, ఇంట్లో గొడవలు సృష్టిస్తూ తనను ఇబ్బంది పెట్టాడని, దీంతో తాను అత్తారింటిని వదిలి రావాల్సి వచ్చిందని ఆమె ఆరోపించింది. ఈ ఆరోపణలు ప్రస్తుతం కోర్టు పరిశీలనలో ఉన్నాయి.
తన ఆరోపణలకు బలం చేకూర్చేలా సప్నా చౌదరి కొన్ని పత్రాలను కోర్టుకు సమర్పించింది. వాటిలో ఫోటోలు, డిజిటల్ రికార్డులు కూడా ఉన్నాయని సమాచారం. ఈ పిటిషన్, ఆధారాలను పరిశీలించిన కోర్టు, ప్రాథమిక దశలో ఆమెకు తాత్కాలిక రక్షణ కల్పించడానికి తగిన కారణాలు ఉన్నాయని భావించింది.
55
తదుపరి విచారణ జూలై 25న..
తదుపరి ఆదేశాలు ఇచ్చే వరకు సప్నాతో మాట్లాడొద్దని, ఆమె ఇంటికి గానీ, పనిచేసే చోటుకి గానీ వెళ్లొద్దని వీర్ సాహును కోర్టు ఆదేశించింది. ఈ ఆదేశాలు కచ్చితంగా అమలయ్యేలా చూడాలని పోలీసు అధికారులకు సూచించింది. ఈ కేసు తదుపరి విచారణ జూలై 25న జరగనుంది.