సందీప్ రెడ్డి వంగా డైరెక్షన్లో వచ్చిన 'అర్జున్ రెడ్డి' సినిమా ఎంత పెద్ద బ్లాక్బస్టర్ హిట్టో తెలిసిందే. ఈ సినిమాలో విజయ్ దేవరకొండ, షాలినీ పాండే కెమిస్ట్రీ అదిరిపోయింది. ఇందులో హీరోయిన్గా మొదట అనుకున్నది షాలిని కాదట.
అర్జున్ రెడ్డితో హిట్ అందుకున్న సందీప్ రెడ్డి వంగా
విజయ్ దేవరకొండ, షాలినీ పాండే 2017లో వచ్చిన 'అర్జున్ రెడ్డి' సినిమా టాలీవుడ్లో ఒక సెన్సేషన్. ఈ రొమాంటిక్ డ్రామాతో సందీప్ రెడ్డి వంగా డైరెక్టర్గా బ్లాక్బస్టర్ అందుకున్నారు. ఈ మూవీతో అటు విజయ్, ఇటు షాలినీ లైఫ్ మారిపోయింది. అయితే ఈ సినిమాకు ఆయన మొదట అనుకున్న హీరోయిన్ ఎవరో తెలుసా? గతేడాది ఓ కార్యక్రమంలో సందీప్ రెడ్డి ఈ విషయం చెప్పారు. తన సినిమాకు ఓ హీరోయిన్ను అనుకున్నానని, కానీ ఓ ఫ్రెండ్ 'ఆ ఆలోచన మర్చిపో' అని సలహా ఇవ్వడంతో ఆమెను వద్దనుకున్నానని తెలిపారు. ఇప్పుడు ఆ పాత వార్త మళ్లీ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
25
అర్జున్రెడ్డికి ఫస్ట్ ఛాయిస్ సాయి పల్లవి
డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగా 2017లో వచ్చిన 'అర్జున్ రెడ్డి' కోసం మొదట సాయి పల్లవినే హీరోయిన్గా అనుకున్నారు. కానీ ఆమె స్లీవ్లెస్ వేసుకోదు, ఇక ఇలాంటి సీన్స్ చేస్తుందా? 'ఆమెను హీరోయిన్గా పెట్టే ఆలోచన మర్చిపో' అని స్నేహితుడు చెప్పాడట.
35
ట్రెండ్ సెట్టర్గా నిలిచిన అర్జున్ రెడ్డి
చివరికి 'అర్జున్ రెడ్డి' సినిమాలో విజయ్ దేవరకొండకు జోడీగా షాలినీ పాండే ఎంపికైంది. వీరిద్దరి కెమిస్ట్రీ, రొమాన్స్ అప్పట్లో తెగ వైరల్ అయ్యాయి. సినిమా కూడా బ్లాక్బస్టర్ హిట్గా నిలిచింది. ఈ మూవీ కల్ట్ మూవీగా నిలిచింది. ట్రెండ్ సెట్టర్గానూ నిలిచింది.
సాయి పల్లవి భారతీయ చిత్ర పరిశ్రమలో ఓ అద్భుతమైన నటి. కానీ సినిమాలకు ఆమె కొన్ని కండిషన్లు పెడుతుంది. ఎక్కువగా మేకప్ వేసుకోదు, పొట్టి బట్టలు ధరించదు. కిస్సింగ్, లిప్లాక్ సీన్లకు కూడా ఒప్పుకోదు. వీటికి ఓకే అంటేనే సాయి పల్లవి ఆ సినిమాలో నటిస్తుంది.
55
సాయిపల్లవి చేస్తోన్న సినిమాలు
సాయి పల్లవి చివరిగా హిందీలో 'ఏక్ దిన్' సినిమాలో కనిపించింది. ప్రస్తుతం ఆమె చేతిలో చాలా సినిమాలున్నాయి. ఓం చాప్టర్ 1, రామాయణ్ పార్ట్ 1, 2, మణిరత్నం సినిమా, ధనుష్తో ఓ సినిమాలో నటిస్తోందని సమాచారం.