తనని కొందరు వ్యక్తిగతంగా టార్గెట్ చేశారని, తన ఎమోషన్స్ తో ఆడుకుంటున్నారని మండిపడింది. తనపై చూపిస్తున్న దయ, జాలికి ధన్యవాదాలని, ఇక వాటిని ఆపాలని తెలిపింది. తాను అబార్షన్స్ చేయించుకున్నానని, పిల్లల్ని కనేందుకు ఆసక్తిగా లేనని, అందుకే చైతూతో విడాకులు తీసుకున్నట్టు కథనాలు రాస్తున్నారని తెలిపింది సమంత. తనని ఒంటరిగా వదిలేయమని వేడుకొంది. విడాకులు తీసుకోవడం చాలా పెయిన్తో కూడిన విషయమని, ఇలాంటి క్లిష్ట సమయంలో తనపై ఈరకంగా దాడులు చేయడం దారుణమని, కానీ తనని ఎవరూ ఏం చేయలేరని స్పష్టం చేసింది సమంత.