సంచలన ప్రెస్ మీట్ కు సమంత ప్లానింగ్.. అందరికీ కలిపి ఒకేసారి బుద్ది చెప్పేందుకే ?

First Published Oct 23, 2021, 5:09 PM IST

బాధనంతా గుండెల్లో దాచుకుని ముఖంపై చిరునవ్వుతో ముందుకు సాగుతోంది సమంత. ప్రస్తుతం సమంత తన స్నేహితురాలు శిల్పారెడ్డితో కలసి సమంత నార్త్ లో హిందూ దేవాలయాలని సందర్శిస్తోంది. 

బాధనంతా గుండెల్లో దాచుకుని ముఖంపై చిరునవ్వుతో ముందుకు సాగుతోంది సమంత. ప్రస్తుతం సమంత తన స్నేహితురాలు శిల్పారెడ్డితో కలసి సమంత నార్త్ లో హిందూ దేవాలయాలని సందర్శిస్తోంది. తీర్థయాత్రల్లో భాగంగా సమంత హిమాలయాల్లో సందడి చేస్తోంది. అక్కడి విశేషాలని ఫోటోల రూపంలో సోషల్ మీడియాలో అభిమానులతో పంచుకుంటోంది సామ్. 

ఇదిలా ఉండగా Samantha, చైతు విడాకుల విషయంలో సామ్ సమస్యలు ఎదుర్కొంటున్న సంగతి తెలిసిందే. సమంతపైనే అనేక నిందలు వేస్తూ సోషల్ మీడియాలో రచ్చ చేస్తున్నారు. ఇక యూట్యూబ్ ఛానల్స్ లో ఊహకందని పుకార్లతో సమంతని బ్లేమ్ చేస్తూ కథనాలు ప్రచురిస్తున్నారు. యూట్యూబ్ ఛానల్స్ పై ఇటీవల సమంత పరువు నష్టం దావా కూడా వేసింది. ఆ కేసుపై ప్రస్తుతం కూకట్ పల్లి కోర్టులో విచారణ జరుగుతోంది. 

Naga Chaitanya తో విడాకుల తర్వాత సమంతపై సోషల్ మీడియాలో, యూట్యూబ్ ఛానల్స్ లో వెలువడిన పుకార్లు సాధారణమైనవి కాదు. ఒక రకంగా చెప్పాలంటే అవి భరించలేని నిందలు. తన స్టైలిస్ట్ తో సామ్ సంబంధం పెట్టుకుందని, ప్రెగ్నన్సీకి నో చెప్పిందని, సరోగసి ద్వారానే పిల్లలు కావాలని కోరిందని అంటూ సమంత వ్యక్తిత్వంపై దెబ్బ కొట్టేలా ఎన్నో పుకార్లు వినిపించాయి. వీటన్నింటికి సామ్ సోషల్ మీడియా ద్వారా సమాధానం ఇచ్చింది. సామ్ తో తన రిలేషన్ షిప్ పై వస్తున్న పుకార్ల విషయంలో నాగ చైతన్య మౌనంగా ఉండడాన్ని స్టైలిస్ట్ ప్రీతమ్ తప్పుబట్టారు కూడా. 

ఇక మౌనంగా ఉంటే కుదరదని.. హేటర్స్ కి తానే స్వయంగా బుద్ది చెప్పాలని సామ్ నిర్ణయించుకున్నట్లు ప్రచారం జరుగుతోంది. త్వరలోనే సమంత సంచలన ప్రెస్ మీట్ నిర్వహించబోతోందట. ఈ ప్రెస్ మీట్ లో తనపై వచ్చిన అన్ని నిందలకు సామ్ సమాధానం ఇవ్వబోతున్నట్లు తెలుస్తోంది. 

అయితే ప్రస్తుతం కోర్టులో పరువు నష్టం కేసు సాగుతోంది. సోమవారం తుది తీర్పు వచ్చే అవకాశాలు ఉన్నాయి. తీర్పు వచ్చాక సామ్ ప్రెస్ మీట్ నిర్వహించే అవకాశాలు ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి.అయితే దీనిపై అధికారిక సమాచారం లేదు. 

అప్పటి వరకు ప్రేమలో ఉన్న ChaySam 2017లో వివాహ బంధంతో ఒక్కటయ్యారు. నాలుగేళ్లపాటు వీరి వైవాహిక జీవితం సాగింది. కేవలం రెండు మూడు నెలల్లోనే వీరి మధ్య విభేదాలు మొదలై వైవాహిక బంధానికి ఫుల్ స్టాప్ పెట్టారు. శాకుంతలం చిత్ర షూటింగ్ పూర్తయ్యాక సామ్ బ్రేక్ తీసుకుంది. ఇప్పుడు కూడా స్నేహితులతో తీర్థయాత్రలు చేస్తోంది. తిరిగొచ్చి తన సినిమాలపై ఫోకస్ పెట్టనుంది. 

click me!