Samantha: హ్యాక్ కి గురైన సమంత ఇన్స్టాగ్రామ్.. కేటీఆర్ ఫోటో, ఆ క్యాప్షన్ తో పోస్ట్ వైరల్ 

First Published Jul 6, 2022, 11:44 AM IST

సమంత ప్రస్తుతం బిజీ హీరోయిన్ గా మారిపోయింది. పాన్ ఇండియా చిత్రాల్లో నటిస్తోంది. అలాగే సమంతకి పలువురు బాలీవుడ్ స్టార్స్ సరసన ఆఫర్స్ వస్తున్నాయి అంటూ ప్రచారం జరుగుతోంది.

సమంత ప్రస్తుతం బిజీ హీరోయిన్ గా మారిపోయింది. పాన్ ఇండియా చిత్రాల్లో నటిస్తోంది. అలాగే సమంతకి పలువురు బాలీవుడ్ స్టార్స్ సరసన ఆఫర్స్ వస్తున్నాయి అంటూ ప్రచారం జరుగుతోంది. ప్రస్తుతం సమంత ఎక్కువగా ముంబై లోనే ఉంటోంది. ఇక సమంత నుంచి తదుపరి రాబోతున్న మూవీ యశోద. 

Image: Samantha Ruth PrabhuInstagram

సోషల్ మీడియాలో సమంత సూపర్ యాక్టివ్ గా ఉంటుంది. తరచుగా సామ్ తన గ్లామరస్ పిక్స్ తో సోషల్ మీడియా వేడెక్కించే ఫోజులు ఇస్తూ ఉంటుంది. ఇదిలా ఉండగా సమంత ఇన్స్టాగ్రామ్ పోస్ట్ తో అభిమానులు గందరగోళానికి గురయ్యారు. సమంత ఇన్స్టాగ్రామ్ ఖాతా నుంచి అసలు ఏమాత్రం సంబంధం లేని పోస్ట్ వైరల్ అయింది. 

తెలంగాణ మంత్రి, సీఎం కేసీఆర్ తనయుడు కేటీఆర్ ఫోటోతో సమంత ఇన్స్టాగ్రామ్ లో పోస్ట్ వైరల్ అయింది. వెంటనే గమనించిన సమంత సోషల్ మీడియా టీమ్ దానిని డిలీట్ చేశారు. ఈ పోస్ట్ పై సమంత సోషల్ మీడియా మేనేజర్ శశాంక వివరణ ఇచ్చింది. సాంకేతిక సమస్యల వల్ల ఈ పోస్ట్ వచ్చిందని.. ఫ్యాన్స్ క్షమించాలని కోరింది. దీనికి కారణమైన వారిపై చర్యలు తీసుకుంటాం అని తెలిపింది. 

దీనితో సమంత ఇంస్టాగ్రామ్ అకౌంట్ హ్యాకింగ్ కి గురైంది అని భావిస్తున్నారు. ఈ పోస్ట్ వైరల్ కావడంతో నెటిజన్లు స్క్రీన్ షాట్స్ తీసి వైరల్ చేశారు. కేటీఆర్ ఫోటోతో.. ప్రజలే నా బలం నా ధైర్యం నా నమ్మకం అని క్యాప్షన్ రాసి ఉంది. 

ఇది పక్కన పెడితే సమంత, కేటీఆర్ మంచి సాన్నిహిత్యం ఉంది. గతంలో తెలంగాణ ప్రభుత్వం తరపున కేటీఆర్ సమంత ని చేనేత వస్త్రాలకు బ్రాండ్ అంబాసిడర్ గా నియమించారు. 

సినిమాల విషయానికి వస్తే సమంత ప్రస్తుతం యశోద, శాకుంతలం చిత్రాల్లో నటిస్తోంది. యశోద మూవీ ఆగష్టులో రిలీజ్ కి రెడీ అవుతోంది. ఇక శాకుంతలం గుణశేఖర్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న పౌరాణిక చిత్రం. 

click me!