ఏ రాజకీయ సంస్థ పేరు చెప్పకుండానే, ఈ నిరసనను రాజకీయ రణరంగంగా మార్చకుండా, విద్యార్థులు, విద్యపైనే దృష్టి పెట్టాలని సల్మాన్ ఖాన్ నొక్కి చెప్పారు. ఢిల్లీలో మార్చ్ సందర్భంగా జరిగిన హింసపై ఆయన నిరాశ వ్యక్తం చేశారు. ఈ ఘర్షణల్లో ప్రభావితమైన విద్యార్థులకు, వారి కుటుంబాలకు తన సపోర్ట్ తెలిపారు.
విద్యార్థులు, విద్యా వ్యవస్థ మధ్య చర్చల ద్వారా ఈ సమస్యను పరిష్కరించుకోవాలని ఆయన అభిప్రాయపడ్డారు. ప్రభుత్వం విద్యార్థుల ఆందోళనలను పరిగణనలోకి తీసుకుని, పరీక్షా ప్రక్రియపై నమ్మకాన్ని పునరుద్ధరిస్తుందని ఆయన విశ్వాసం వ్యక్తం చేశారు.