Guppedantha Manasu: వసుధారను కిడ్నాప్ చేసిన సాక్షి.. దేవయాని కుట్రకు అల్లాడిపోతున్న రిషి!

Published : Sep 01, 2022, 09:22 AM IST

Guppedantha Manasu: బుల్లితెరపై ప్రసారమవుతున్న గుప్పెడంత మనసు (Guppedantha Manasu) సీరియల్ ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంటుంది. కాలేజ్ లో లెక్చరర్ కు స్టూడెంట్ కు మధ్య కలిగే ప్రేమ కథతో సీరియల్ కొనసాగుతుంది. ఇక ఈరోజు సెప్టెంబర్ 1వ తేదీ ఎపిసోడ్ లో ఏం జరిగిందో తెలుసుకుందాం...  

PREV
16
Guppedantha Manasu: వసుధారను కిడ్నాప్ చేసిన సాక్షి.. దేవయాని కుట్రకు అల్లాడిపోతున్న రిషి!

ఈరోజు ఎపిసోడ్ ప్రారంభంలోనే... రిషి అక్కడున్న పిల్లలందరినీ పరీక్షలు ఎలా రాశారు అని అడుగుతారు. అప్పుడు వసుధార  బానే రాశాను సార్ అని అంటుంది. అందరూ బాగా రాయాలి మీ భవిష్యత్తు దీని మీద ఆధారపడి ఉన్నది అని చెప్పి రిషి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. తర్వాత పుష్ప వసుతో ఈ పరీక్ష అయిపోయిన తర్వాత మనం ఈ కాలేజ్ ని, మన స్నేహితులని, రీషి సార్ తిట్టిన తిట్లని మిస్ అవుతాం కదా అని అనగా రిషి సర్ నే ముందు నేను మిస్ అవుతాను అని  మనసులో అనుకుంటుంది.
 

26

ఆ తర్వాత సీన్లో దేవయాని సాక్షితో ఇంట్లో వాళ్ళందరూ ఆ వాసుదారుని దేవత లా చూసి గుడికడుతున్నారు ఇప్పుడు తను పరీక్షలన్నీ బాగా రాస్తే వాళ్ళ ప్రేమ గెలిచి రేపు పెళ్లి అని అంటారు. కనుక ఇంక ఈ పరీక్షలో అది పాస్ అవ్వకూడదు అసలు తన పరీక్ష రాయడానికి వీల్లేదు అని దేవయాని సాక్షితో అంటుంది. ఆ తర్వాత సీన్ లో వసు పుష్పతో నేను లైబ్రరీ కి వెళ్లి తర్వాత ఇంటికి వెళ్తాను,ముందు మీరు వెళ్ళండి అని అంటుంది.ఇంతలో అక్కడ మూల నుంచి ఒక ఆవిడ వసుధార ని చాలా కోపంగా చూస్తుంది.
 

36

 వసు లైబ్రరీ లోకి వెళ్తున్నప్పుడు జగతి మహీంద్రాలు అక్కడికి వచ్చి రా వసు ఇంటికి దింపుతామని అంటారు. నాకు లైబ్రరీలో పనున్నది సార్ అని అనగా వెయిట్ చేస్తాంలే  వెళ్లిరా అని అంటారు. వద్దు సార్ మీరు వెళ్ళండి అని వసు అంటుంది ఇంతలో రిషి అక్కడికి వస్తాడు. విద్యార్థులు పరీక్ష ఎలా రాశారు అని రిషి అడుగుతాడు. అప్పుడు అందరు బానే రాశారట అని జగతి అంటుంది. కొంతమంది బాగా చదివే వాళ్ళు ఎలా రాసారో కనుక్కున్నారా అని వసుని చూస్తూ ఉంటాడు రిషి.
 

46

నేను బానే రాశాను సార్ అని అంటుంది వసు. ఆ తర్వాత రిషి తన క్యాబిన్లోకి వెళ్లి వసుకి ఎగ్జామ్ ఎలా రాసావని మెసేజ్ పెడతాడు. పరీక్షలు అయ్యాక ఏమి చేస్తావు అని రిషి అడగగా నాకు ఇష్టమైన వాళ్ళతో లాంగ్ డ్రైవ్ వెళ్తాను సార్ అని అంటుంది వసు. మరి వాళ్ళని అడిగేవ అని రిషి మెసేజ్ చేస్తాడు. అడిగితే ఒప్పుకుంటారని నమ్మకం ఉన్నది అని అంటుంది వసు.  ఇంతలో సాక్షి ఒక ఆవిడతో వసుధారకి నాప్కిన్ లో ఏదో మత్తుమందు కలిపి వసు ఇస్తుంది. వసు కళ్ళు తిరిగి పడిపోతుంది.
 

56

 అప్పుడు ఆవిడ వసు ని కాలేజీలో ఒక గదిలో పడేస్తుంది. ఆరోజు రాత్రి రిషి, వసుకి మెసేజ్ చేస్తే వసు తిరిగి రిప్లై ఇవ్వదు. ఫోన్ చేస్తే స్విచ్ ఆఫ్ అని వస్తుంది. రిషి కంగారు పడతాడు. ఇంతలో దేవయానికి సాక్షి పని విజయవంతంగా జరిగింది అని అంటుంది. దేవయాని చాలా సంతోష పడిపోతుంది. తర్వాత గౌతమ్, రిషి వసుధార ఇంటికి వెళ్లి చూద్దాము అని బయలుదేరుతారు. ఇంటికెళ్లి చూస్తే వాసుధార ఇంట్లో తాళం వేసి ఉంటుంది. గౌతమ్, జగతి మహీంద్ర లకు విషయం చెప్తాడు.వాళ్లు కూడా  వసుని వెతకడానికి బయలుదేరుతారు దేవయాని కింద నే ఉంటుంది.
 

66

 ఎక్కడికి వెళ్తున్నారు అని అడగగ వసు కనిపించడం లేదు వెతకడానికి వెళ్తున్నాము అని అంటాడు మహేంద్ర.దేవయాని అయ్యో పాపం అని నటిస్తుంది. ఇంతలో రిషి గౌతమ్ లు కాలేజీలో వెతకడానికి బయలుదేరుతారు. రిషి గౌతమ్ లు కాలేజీ లోపలికి వెళ్లి వెతుకుతున్నారు. ఇంతలో జగతి, మహీంద్రాలు కూడా అక్కడికి వస్తారు.లోపల ఎక్కడ కనిపించట్లేదు అని రిషి అంటాడు.ఇంతటితో ఎపిసోడ్ ముగుస్తుంది. తర్వాయి భాగంలో ఏం జరిగిందో తెలియాలంటే రేపటి వరకు ఎదురు చూడాల్సిందే!

click me!

Recommended Stories