రానా దగ్గుబాటి , సాయిపల్లవి ప్రధాన పాత్రలలో తెరకెక్కిన సినిమా విరాట పర్వం. జూన్ 17న ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ అయ్యింది ఈమూవీ. ఈ సినిమా ప్రమోషన్స్ లో భాగంగా ఓ యూట్యూబ్ ఛానల్కి ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆమె మాట్లాడుతూ.. కొన్ని రోజుల ముందు కూడా నేను ఈ కశ్మీరీ ఫైల్స్ వచ్చింది కద.. సో.. కశ్మీరీ ఫైల్స్ వచ్చినప్పుడు వాళ్లు చూపించారు ఎట్లా చంపారు. ఆ టైంలో అక్కడ ఉన్న కశ్మీరీ పండిట్స్ను ఎట్లా చంపారనేది చూపించారు కద. కోవిడ్ టైంలో ఎవరో If You Taking A Religious Conflict లాగా తీసుకుంటే రీసెంట్గా ఎవరో ఒక బండిలో ఆవుని తీసుకెళుతున్నారు. ఆ బండి డ్రైవ్ చేసేవాళ్లు ముస్లింగా ఉన్నారు. కొన్ని జనాలు కొట్టి జై శ్రీరాం.. జై శ్రీరాం అని చెప్పారా. అప్పుడు జరిగిన దానికి, ఇప్పుడు జరిగిన దానికీ తేడా ఎక్కడ ఉంది..? అంటూ క్యాజువల్ గా కామెంట్ చేసింది.