నాగ చైతన్య అంత కేరింగ్ చూపిస్తాడా.. టాలీవుడ్ లో బెస్ట్ ఫ్రెండ్స్ వీళ్ళిద్దరే, సాయి పల్లవి కామెంట్స్

First Published Jun 30, 2022, 1:33 PM IST

హీరోయిన్ సాయి పల్లవికి సౌత్ లో సపరేట్ ఫ్యాన్ బేస్ ఉంది. ఇప్పటి ట్రెండ్ కి తగ్గట్లుగా హాట్ డ్రెస్సుల్లో కనిపించకుండానే సాయి పల్లవి స్టార్ హీరోల స్థాయిలో క్రేజ్ అందుకుంది.

హీరోయిన్ సాయి పల్లవికి సౌత్ లో సపరేట్ ఫ్యాన్ బేస్ ఉంది. ఇప్పటి ట్రెండ్ కి తగ్గట్లుగా హాట్ డ్రెస్సుల్లో కనిపించకుండానే సాయి పల్లవి స్టార్ హీరోల స్థాయిలో క్రేజ్ అందుకుంది. అందంగా హావ భావాలు పలికిస్తూ ఎమోషనల్ గా ప్రేక్షకులని కట్టి పడేస్తూ సాయి పల్లవి ఓ ప్రత్యేకమైన హీరోయిన్ గా రాణిస్తోంది. ఈ హైబ్రీడ్ పిల్ల నిజంగా రేర్ పీస్. 

ఇదిలా ఉండాగా సాయి పల్లవి తాజాగా ఓ ఇంటర్వ్యూలో టాలీవుడ్ లో తన బెస్ట్ ఫ్రెండ్స్ గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది. సాయి పల్లవి తెలుగులో వరుణ్ తేజ్, రానా, నాని, శర్వానంద్, నాగ చైతన్య లాంటి హీరోలతో నటించింది. కానీ తనకు తెలుగులో బెస్ట్ ఫ్రెండ్స్ మాత్రం ఇద్దరేనట. 

వాళ్లిద్దరూ మరెవరో కాదు.. నాగ చైతన్య, రానా అని తెలిపింది సాయి పల్లవి. సాయి పల్లవి, నాగ చైతన్య గత ఏడాది లవ్ స్టోరీ చిత్రంలో జంటగా నటించారు. శేఖర్ కమ్ముల దర్శకత్వంలో వచ్చిన ఈ చిత్రం మంచి విజయం సాధించింది. ఈ మూవీలో చైతు, సాయి పల్లవి కెమిస్ట్రీ అదిరిపోయిందనే చెప్పాలి. 

నాగ చైతన్య తనకు బెస్ట్ ఫ్రెండ్ అంటూ సాయి పల్లవి ప్రశంసలు కురిపించింది. తన పట్ల చైతు చాలా కేరింగ్ గా ఉంటాడట. అలాగే రానా కూడా తనకు బెస్ట్ ఫ్రెండ్ అని తెలిపింది సాయి పల్లవి. వీరిద్దరితో ఉంటే ఒకే ఫ్యామిలీ అనే ఫీలింగ్ ఉంటుందని సాయి పల్లవి పేర్కొంది. 

రీసెంట్ గా సాయి పల్లవి రానాతో కలసి విరాట పర్వం చిత్రంలో నటించింది. ఈ చిత్రంలో సాయి పల్లవి నటనకు ప్రశంసలు దక్కాయి కానీ మూవీ బాక్సాఫీస్ వద్ద రాణించలేదు. 

ప్రస్తుతం సాయి పల్లవి గార్గి అనే చిత్రంలో నటిస్తోంది. సాయి పల్లవి ఇంకా తన నెక్స్ట్ తెలుగు మూవీ కి సైన్ చేయలేదు. కేవలం నెలల వ్యవధిలోనే లవ్ స్టోరీ, శ్యామ్ సింగరాయ్, విరాట పర్వం చిత్రాలు రిలీజ్ అయ్యాయి. 

click me!