సుప్రీం హీరో సాయి ధరమ్ తేజ్ నటించిన విరూపాక్ష చిత్రం మరికొన్ని గంటల్లో ప్రేక్షకుల ముందుకు రానుంది. ఏప్రిల్ 21న ఈ చిత్రాన్ని గ్రాండ్ గా రిలీజ్ చేస్తున్నారు. సాయిధరమ్ తేజ్ యాక్సిడెంట్ నుంచి కోలుకున్న తర్వాత నటించిన తొలి చిత్రం ఇది. 90 దశకంలో ఉన్న మూఢనమ్మకాల నేపథ్యంలో తెరకెక్కిన థ్రిల్లర్ చిత్రం ఇది.