ఐటీ అధికారులు రెండు రోజులుగా జరిపిన సోదాల్లో అనేక విషయాలు గుర్తించినట్లు మీడియాలో వార్తలు వస్తున్నాయి. మైత్రి నిర్మాణ సంస్థ గత కొన్నేళ్లుగా టాలీవుడ్ బడా హీరోలతో భారీ బడ్జెట్ చిత్రాలు తెరకెక్కిస్తున్నారు. వీరి నిర్మాణంలో శ్రీమంతుడు, జనతా గ్యారేజ్, రంగస్థలం, చిత్రలహరి, ఉప్పెన, వీరసింహారెడ్డి, వాల్తేరు వీరయ్య, పుష్ప 1 లాంటి సూపర్ హిట్ చిత్రాలు నిర్మించారు.