కార్తీక్ (Karthik) తన జీవితంలో వచ్చిన మచ్చ గురించి ఆలోచిస్తాడు. అమ్మ నాన్నల గురించి తలుచుకొని బాధపడుతాడు. ఈలోపు బాబు ఏడుస్తుండగా కార్తీక్ వెళ్లి ఎత్తుకొగా ఏడుపు ఆపేస్తాడు. కార్తీక్ నీకు నాకు ఎ జన్మ బంధమో కానీ నేను ఎత్తుకొగానే ఏడుపు ఆపేస్తున్నావ్ అని మనసులో అనుకుంటాడు.
ఇక వారణాసి (Varanasi) సౌందర్య దగ్గరకు వచ్చి మోనిత పెట్టిన క్లినిక్ గురించి చెబుతాడు. అంతే కాకుండా అక్కడకు ఎవరు వైద్యం కోసం వెళ్లడం లేదని అంటాడు. ఇక పాలు, కూరగాయలు కూడా బస్తీ వాళ్ళు ఎవరు అమ్మడం లేదని చెబుతాడు. సౌందర్య కార్తీక్ (Karthik) ఎక్కడున్నాడో తెలిస్తే చెప్పమంటుంది.
మరోవైపు తమ పని పూర్తి చేసుకొని ఇంటికి వెళుతున్న శ్రీవల్లి (Srivalli) దంపతులను రుద్రాణి (Rudrani ) మనిషి ఆక్సిడెంట్ చేయిస్తాడు. అక్కడకు స్థానికులు వచ్చి అంబులెన్సు కి ఫోన్ చేసే లోపే ఇద్దరు చనిపోతారు.
ఒకవైపు మౌనిత (Monitha) హాస్పిటల్ కు రాగానే అక్కడకు వారణాసి (Varanasi) వచ్చి మీరు అర్జెంట్ గా ఈ హాస్పిటల్ తీసేయాలని చెబుతాడు. కానీ మోనిత అవేమి పట్టించుకోకుండా నా ఇల్లు నా ప్లేస్ అన్నీ నా ఇష్టం అన్నట్టు మాట్లాడుతుంది. ఇక అక్కడి నుంచి బస్తీ వాళ్ళు వెళ్ళిపోతారు.
ప్రమాదం జరిగిన సంగతి తెలుసుకున్న కార్తీక్ రుద్రాణి (Rudrani) దగ్గరకి కోపంగా వస్తాడు. రుద్రాణి ని మాటలతో కడుగుతాడు. కానీ రుద్రాణి ఏమీ తెలియనట్టుగా ప్రవర్తిస్తుంది. వాళ్ళ చావుకి నాకు ఏమీ సంబంధం లేదు. మర్యాదగా నువ్వు ఇక్కడనుంచి వెళ్ళిపో ఎక్కువ మాట్లాడితే వేరేలా ఉంటుంది అని కార్తీక్ (Karthik) కి వార్నింగ్ ఇస్తుంది.
మొత్తం నువ్వే చేసావ్ నాకు అంతా తెలుసు అంటాడు కార్తీక్ (Karthik) దానికి తలుపు మూసి అవును.. నేనే చేశాను ఇప్పుడు ఏంటి? అన్నట్టు మాట్లాడుతుంది. రుద్రాణి (Rudraniki) కు కోపం వస్తే ఏదైనా జరుగుతుంది అని చెబుతుంది.
ఇక కార్తీక్ (Karthik) రుద్రాణి తో చేసిన తప్పు మర్యాదగా ఒప్పుకొని పోలీస్ లకు లొంగిపో అని చెబుతాడు. లేకపోతె వేరేలా ఉంటదని వార్నింగ్ ఇస్తాడు. ఇక రుద్రాణి (Rudrani) కి గత ఒప్పందాలను గుర్తు చేసుకొని నీ కూతురిని కూడా దత్తత తీసుకుంటా అని చెబుతుంది. ఇక ఆ మాటతో సీరియస్ అయిన కార్తీక్ రాద్రాణి ని ఎం చేస్తాడో రేపటి భాగంలో చూడాలి.