చివరగా `నాటు నాటు` పాటని ప్రదర్శించారు. ఇలా ఇండియన్ సినిమాని ఆస్కార్లో ప్రదర్శించడం ఇదే మొదటిసారిగా చెప్పొచ్చు. `ఆర్ఆర్ఆర్` మూవీకి రాజమౌళి దర్శకత్వం వహించారు. ఎన్టీఆర్, రామ్చరణ్ హీరోలుగా నటించారు. ఇప్పటి వరకు వచ్చిన వాటిలో బిగ్గెస్ట్ మల్టీస్టారర్గా నిలిచిందీ మూవీ. సుమారు నాలుగు వందల కోట్ల బడ్జెట్తో రూపొంది, 1150కోట్లు వసూలు చేసింది. ఈమూవీని డీవీవీ దానయ్య నిర్మించడం విశేషం. ఇందులో అలియాభట్, బ్రిటీష్ నటి ఒలివియా మోర్రీర్, అజయ్ దేవగన్, శ్రియా కీలక పాత్రల్లో మెరిశారు.