ఇటీవల ఓటీటీలోకి వచ్చిన మలయాళం హిట్ మూవీ ఉయిర్ ప్రేక్షకులని మెప్పిస్తోంది. ఈ మూవీలో రోషన్ మాథ్యూ ప్రధాన పాత్రలో నటించారు. ట్విస్ట్ లు మాత్రమే కాదు, కన్నీళ్లు పెట్టించే ఎమోషనల్ సీన్స్ కూడా ఈ మూవీలో ఉన్నాయి.
మలయాళం నుంచి వచ్చే థ్రిల్లర్ సినిమాలకు అన్ని భాషల్లో విపరీతమైన డిమాండ్ ఉంది. అందుకే మలయాళం థ్రిల్లర్ చిత్రాలని ఓటీటీలో అన్ని భాషల్లోకి డబ్ చేస్తుంటారు. ఇటీవల విజయం సాధించిన ఉయిర్ అనే చిత్రం ఓటీటీలోకి వచ్చేసింది. పద్మకుమార్ దర్శత్వంలో రోషన్ మాథ్యూ హీరోగా ఈ చిత్రం తెరకెక్కింది. అత్యుల్య చంద్ర, శ్రుతి మీనన్, బైజు సంతోష్, వినోద్ సాగర్ కీలక పాత్రల్లో నటించారు. ఈ చిత్రం ప్రస్తుతం జియో హాట్ స్టార్ లో స్ట్రీమింగ్ అవుతోంది.
25
రియల్ స్టోరీ
పోలీస్ ఇన్వెస్టిగేషన్ డ్రామాగా రూపొందిన ఈ క్రైమ్ థ్రిల్లర్ చిత్రం ఆడియన్స్ ని విపరీతంగా ఆకట్టుకుంటోంది. ఒక మహిళ సూసైడ్ నేపథ్యంలో మొదలైన కథ ఆ తర్వాత క్రైమ్ యాంగిల్ కి మారుతుంది. చివరికి ఎమోషనల్ గా ముగుస్తుంది. ఇన్వెస్టిగేషన్ వేగం పుంజుకున్నప్పుడు వచ్చే ట్విస్ట్ లు ఆకట్టుకుంటాయి. క్రైమ్ జరిగిన బ్యాక్ డ్రాప్ కూడా ఆసక్తికరంగా ఉంటుంది. ఇది యదార్థ సంఘటనల ఆధారంగా రూపొందిన రియల్ స్టోరీ.
35
కథ ఏంటంటే
కేరళలోని ఓ ఊరికి అజీబ్( రోషన్ మాథ్యూ) ప్రొబేషనరీ ఎస్ఐగా వస్తాడు. అతడు డ్యూటీలో చేరిన కొన్ని రోజులకే ఊరి చివరన బావిలో ఒక మహిళ శవం బయట పడుతుంది. అజీబ్ ఇన్వెస్టిగేషన్ ప్రారంభించగా ఆమె పేరు శోభ అని.. రోజూ కూలీగా పనిచేస్తూ ఉంటుంది అని తెలుస్తోంది. ఆమెకి ఇద్దరు పిల్లలు.. రాజు అనే భర్త కూడా ఉన్నట్లు తెలుస్తుంది. ఆమె భర్తని ఎలాగోలా వెతికి పట్టుకుని తీసుకువస్తారు. చనిపోయింది తన భార్యే అని గుర్తిస్తాడు. శోభ ఆమె ప్రియుడితో అక్రమ సంబంధం పెట్టుకోవడం వల్లే తాను దూరంగా ఉంటున్నానని పిల్లలని మా సోదరి వద్ద ఉంచి పెంచుతున్నాను అని రాజు పోలీసులకు చెబుతాడు. శోభ డెడ్ బాడీ చూసి తీవ్ర భావోద్వేగానికి గురవుతాడు.
కొంత కాలానికి శోభ ప్రియుడు ఆమెని వదిలేసి వెళ్ళిపోయాడు అని.. ఆ బాధతోనే శోభ ఆత్మహత్య చేసుకుని ఉండొచ్చు అని రాజు చెబుతాడు. రాజు చెప్పింది నిజమని పోలీసులు నమ్ముతారు. అతడికి వ్యతిరేకంగా ఎలాంటి ఆధారాలు కూడా ఉండవు. దీనితో అతడిని వదిలి పెట్టడమే కాకుండా ఆర్థిక సాయం కూడా చేస్తారు. కొన్ని రోజుల తర్వాత శోభ మరణం గురించి వార్తల్లో తెలుసుకున్న ఆమె బంధువులు సడెన్ గా పోలీస్ స్టేషన్ కి వస్తారు. వాళ్ళు ఇచ్చే ట్విస్ట్ తో మైండ్ బ్లాక్ కావడం ఖాయం. దీనితో కేసు మళ్ళీ మొదటికి వస్తుంది. ఆమె బంధువులు అసలేం చెప్పారు. రాజు చెప్పినదంతా నిజమేనా ? ఏదైనా దాచి పెట్టాడా ? అసలు శోభ అక్రమ సంబంధం పెట్టుకున్నది ఎవరితో ? ఆమె పిల్లలు ఏమయ్యారు ? లాంటి విషయాలు సినిమా చూసే తెలుసుకోవాలి.
55
కన్నీళ్లు పెట్టించిన పోలీస్
ఈ మూవీలో హీరో రోషన్ మాథ్యూ లీడ్ గా జరిగే ఇన్వెస్టిగేషన్ సీన్స్ ఆద్యంతం ఆకట్టుకుంటాయి. అతడి పెర్ఫార్మెన్స్ చాలా సెటిల్డ్ గా ఉంటుంది. క్లైమాక్స్ లో కేసు ముగిసినప్పటికీ మానవత్వంతో ఇంకా వదలకుండా అతడు చేసిన ప్రయత్నం, పలికించిన ఎమోషన్ కన్నీళ్లు పెట్టించే విధంగా ఉంటుంది. పోలీసులు డ్యూటీ మాత్రమే కాదు మానవత్వం కూడా చూపించాలి అని చాటి చెప్పిన రియల్ స్టోరీ ఇది. యదార్థ సంఘటనల ఆధారంగా తెరకెక్కించారు. థ్రిల్లర్ సినిమాలని ఇష్టపడేవారు అస్సలు మిస్ కాకుండా చూడాల్సిన చిత్రం ఇది.