నేపాల్ పర్యటన.. 'ఐరన్ లెగ్' ట్రోలింగ్
ఇటీవల రోజా వ్యక్తిగత పర్యటన నిమిత్తం నేపాల్ వెళ్లారు. అయితే ఆమె అక్కడ నుంచి తిరిగొచ్చిన కొద్ది రోజులకే టిబెట్ సరిహద్దు ప్రాంతాల్లో హిమనదాలు కరిగి, నేపాల్లో అనూహ్యంగా భీకర మెరుపు వరదలు సంభవించాయి. ఈ జలప్రళయంలో భారీగా ఆస్తి, ప్రాణ నష్టం జరిగింది. అయితే, గతంలో రోజాను లక్ష్యంగా చేసుకుని 'ఐరన్ లెగ్' అంటూ మూఢనమ్మకాలతో విమర్శించే కొందరు సోషల్ మీడియా యూజర్లు, ఈ ప్రకృతి విపత్తును కూడా ఆమెకే ముడిపెట్టారు.
రోజా నేపాల్లో అడుగుపెట్టడం వల్లే అక్కడ అంతటి ప్రళయం వచ్చిందంటూ నెటిజన్లు దారుణమైన మీమ్స్, ట్రోల్స్ చేయడం ప్రారంభించారు. ఈ నెగెటివిటీ తీవ్రం కావడంతో, సరిహద్దు వద్ద పరిస్థితిని వివరిస్తూ రోజా తన ఇన్స్టాగ్రామ్ ఖాతాలో పోస్ట్ చేసిన నేపాల్ పర్యటన వీడియోలను డిలీట్ చేయాల్సి వచ్చింది.