ఒక ఎండిగా నువ్వు ఓడిపోకూడదు, నువ్వు ఎండి గా ఉన్నప్పుడు ఎలాంటి పొరపాట్లు జరగకూడదు అందుకే చేశాను అంటాడు రిషి. సీన్ కట్ చేస్తే మహేంద్ర ని చూడటానికి వస్తారు ఫణీంద్ర ఫ్యామిలి. మత్తులో ఉన్న మహేంద్ర ని చూసి బాధపడతాడు ఫణీంద్ర. వాళ్ల ఇంటికి వచ్చేయమని దేవయాని, శైలేంద్ర,ఫణింద్ర ముగ్గురు అడుగుతారు. అయితే దేవేంద్ర అందుకు ఒప్పుకోడు నావల్ల కుటుంబానికి అప్రతిష్ట అన్నారు అలాంటిది మీ ఇంటికి ఎందుకు వస్తాను అంటాడు.