ఏం జరిగింది అంటూ అందరూ కంగారు పడతారు. మహేంద్ర సర్ది చెప్పడంతో కొంచెం కూల్ అవుతుంది జగతి. శైలేంద్ర, వసుకి జ్యూస్ ఇచ్చి రిషికి తాగించమని చెప్తాడు. వసు, రిషికి జ్యూస్ తాగించబోతే జగతి గబగబా వేదిక మీదకి వచ్చి ఆ గ్లాస్ లాక్కొని ఈ జ్యూస్ తాగొద్దు అంటూ కంగారుగా చెప్తుంది. అందరూ ఒక్కసారిగా షాక్ అయిపోతారు. ఎందుకు తాగొద్దు ఏమైంది అంటాడు రిషి.