`కాంతార 2`కి రిషబ్‌ శెట్టి పారితోషికం ఎంతో తెలుసా? 25 రెట్లు పెంపు.. యష్‌, శివరాజ్‌ కుమార్‌లు దరిదాపుల్లో కూడా లేరు

Published : Jul 12, 2025, 01:07 PM IST

కాంతార`తో సంచలనం సృష్టించి రిషబ్‌ శెట్టి త్వరలో `కాంతార 2`తో రాబోతున్నారు. అయితే ఈ సినిమాకి ఆయన తీసుకుంటున్న పారితోషికం తెలిస్తే మాత్రం షాక్‌ అవ్వాల్సిందే. 

PREV
15
`కాంతార`తో రిషబ్‌ శెట్టి సరికొత్త సంచలనం

కన్నడలో `కేజీఎఫ్‌` మూవీ ఒక సంచలనం సృష్టించింది. కన్నడ సినిమా పరిశ్రమని ప్రపంచానికి పరిచయం చేసింది. రీమేక్‌ సినిమాలతో రన్‌ అయ్యే పరిశ్రమ అనే విమర్శల నుంచి తాము సంచలనాలు క్రియేట్‌ చేస్తామని నిరూపించింది `కేజీఎఫ్‌`.

 దాన్ని కంటిన్యూ చేసింది `కాంతార`. ఎలాంటి అంచనాలు లేకుండా మూడేళ్ల క్రితం వచ్చిన ఈ మూవీ సరికొత్త సంచలనం సృష్టించింది. కన్నడ సినిమా పరిశ్రమ సత్తా ఏంటో చూపించింది. ఈ చిత్రం నాలుగు వందల కోట్లకుపైగా కలెక్షన్లని సాధించడం విశేషం.

25
`కాంతార`కి ప్రీక్వెల్‌గా వస్తోన్న `కాంతారః ఛాప్టర్‌ 1`

ఇప్పుడు `కాంతార 2` రాబోతుంది. `కాంతార`కి ప్రీక్వెల్‌గా `కాంతారః ఛాప్టర్‌ 1` పేరుతో దీన్ని రూపొందిస్తున్నారు దర్శకుడు రిషబ్‌ శెట్టి. ప్రస్తుతం చిత్రీకరణ చివరి దశలో ఉంది. 

ఇటీవలే రిలీజ్‌ డేట్‌ని ప్రకటించారు. గాంధీ జయంతి సందర్భంగా అక్టోబర్‌ 2న విడుదల చేయనున్నట్టు టీమ్‌ వెల్లడించింది. 

పాన్‌ ఇండియా మూవీగా దీన్ని కన్నడతోపాటు తెలుగు, తమిళం, మలయాళం, హిందీ భాషల్లో విడుదల చేయబోతున్నారు. 

ఈ సినిమా `కాంతార` కథకి ముందు జరిగిన స్టోరీ ప్రధానంగా సాగుతుంది. కథ మూలాలను ఆవిష్కరించే చిత్రమిది.  హీరో పాత్రకి సంబంధించిన గత చరిత్రని ఆవిష్కరించబోతున్నారు.

35
భారీ స్కేల్‌లో `కాంతార 2`

`కాంతార` మూవీని రిషబ్‌ శెట్టి దర్శకత్వం వహిస్తూ, హీరోగా నటించారు. ఆయన సరసన సప్తమిగౌడ హీరోయిన్‌గా నటించింది. ఇప్పుడు దీని ప్రీక్వెల్‌ని కూడా ఆయనే దర్శకత్వం వహిస్తూ నటిస్తున్నారు. 

హోంబలే ఫిల్మ్స్ చాలా ప్రతిష్టాత్మకంగా భారీ బడ్జెట్‌తో దీన్ని తెరకెక్కిస్తోంది. మొదటి సినిమా భారీ విజయం సాధించడంతో `కాంతార 2` స్కేల్‌ బాగా పెరిగిపోయింది. 

యాక్షన్‌ సీన్లు హైలైట్గా ఉంటాయని సమాచారం.  చాలా గ్రాండియర్‌గా తీర్చిదిద్దుతున్నారు.  వెయ్యి కోట్ల బాక్సాఫీసు కలెక్షన్ల టార్గెట్‌తో దీన్ని తెరకెక్కిస్తున్నట్టు తెలుస్తోంది. 

45
`కాంతార 2` రిషబ్‌ శెట్టి పారితోషికం తెలిస్తే షాకే

అయితే `కాంతార 2`కి రిషబ్‌ శెట్టి పారితోషికం తెలిస్తే షాక్‌ అవ్వక మానరు. ఎందుకంటే మొదటి పార్ట్ తో పోల్చితే 25రెట్లు పెంచడం విశేషం. 

మొదటి సినిమాకి నాలుగు కోట్ల పారితోషికం తీసుకున్న రిషబ్‌ శెట్టి ఇప్పుడు `కాంతారః ఛాప్టర్‌ 1`కి ఏకంగా వంద కోట్లు పారితోషికంగా తీసుకుంటున్నారట. ఇదే ఇప్పుడు కన్నడలో చర్చనీయాంశంగా మారింది. 

ఒక్క సినిమా హిట్‌ తో 25రెట్లు పారితోషికం పెంచిన ఏకైక ఇండియన్‌ స్టార్‌గా రిషబ్‌ శెట్టి రికార్డు సృష్టించారని చెప్పొచ్చు. దీంతో ఇప్పుడు పాన్‌ ఇండియా తెలుగు హీరోల జాబితాలో రిషబ్‌ శెట్టి చేరిపోయారు.

55
యష్‌, ఉపేంద్ర, శివరాజ్‌ కుమార్‌, సుధీప్‌లను మించిన పారితోషికం

అంతేకాదు కన్నడలో ఈ రేంజ్‌లో పారితోషికం తీసుకునే నటుడు ఎవరూ లేరు. `కేజీఎఫ్‌`తో సంచలనాలు క్రియేట్ చేసిన యష్‌ సైతం రూ.50 కోట్లు మాత్రమే పారితోషికంగా తీసుకుంటున్నారట.

 ప్రస్తుతం ఆయన `టాక్సిక్‌` రెమ్యూనరేషన్‌ యాభై కోట్లు. ఇక కన్నడ స్టార్స్ సుదీప్‌ ఇరవై కోట్ల వరకు, దర్శన్‌ ఇరవై కోట్ల వరకు, శివరాజ్‌ కుమార్‌ పది కోట్ల వరకు, ఉపేంద్ర రూ.15కోట్ల వరకు పారితోషికం తీసుకుంటున్నారు. వీరంతా రిషబ్‌ శెట్టి దరిదాపుల్లో కూడా లేకపోవడం గమనార్హం. 

ఇదిలా ఉంటే రిషబ్‌ శెట్టి తెలుగులో `జై హానుమాన్‌`లో టైటిల్‌ రోల్‌పోషిస్తున్న విషయం తెలిసిందే. 

AR
About the Author

Aithagoni Raju

అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.Read More...
Read more Photos on
click me!

Recommended Stories