బాలీవుడ్ లో రాణిస్తున్న బోల్డ్ హీరోయిన్లలో రిచా చద్దా ఒకరు. రిచా చద్దా 'షకీలా' బయోపిక్ లో కూడా నటించిన సంగతి తెలిసిందే. రీసెంట్ గా రిచా చద్దా 'హీరామండి' అనే వెబ్ సిరీస్ లో నటించింది. సంజయ్ లీలా భన్సాలీ తెరకెక్కించిన ఈ వెబ్ సిరీస్ ఓటిటిలో సక్సెస్ ఫుల్ గా దూసుకుపోతోంది. రిచా చద్దా ఈ వెబ్ సిరీస్ సక్సెస్ ని ఎంజాయ్ చేస్తోంది.
ఈ వెబ్ సిరీస్ లో రిచా చద్దాతో పాటు అదితి రావు హైదరి, సోనాక్షి సిన్హా లాంటి వారు కీలక పాత్రల్లో నటించారు. అయితే రిచా చద్దా తరచుగా ఇటీవల వివాదాల్లో నిలుస్తోంది. తాజాగా ఆమె ఇన్స్టాగ్రామ్ స్టోరీస్ లో చేసిన ఓ పోస్ట్ తీవ్ర వివాదం గా మారింది.
రిచా చద్దా ప్లాస్టిక్ సర్జరీల గురించి మాట్లాడుతూ ఓ హీరోయిన్ ని టార్గెట్ చేసి ఈ పోస్ట్ చేసింది. ఆమెతో రిచా చద్దాకి ఏదో గొడవ జరిగినట్లు ఉంది. దీనితో సోషల్ మీడియా వేదికగా రిచా తన కోపాన్ని ప్రదర్శించింది.
'ఏమీ లేదు.. కొందరు విషపూరిత మహిళల నుంచి దూరంగా వెళుతున్నా. వాళ్లంతా వయసు పైబడినవారు. కానీ టీనేజర్ల లాగా కనిపించేందుకు డ్రెస్సులు వేసుకుంటారు. పది ప్లాస్టిక్ సర్జరీలు చేయించుకున్నారు. కానీ తమది నేచురల్ అందం అంటూ బిల్డప్ లు ఇస్తుంటారు. అక్కా అబద్దాలు చెప్పకు.. నువ్వు ఎన్ని ప్లాస్టిక్ సర్జరీలు చేయించుకున్నావో తెలుసు. మాకు కళ్ళు ఉన్నాయి అంటూ రిచా చద్దా సంచలన వ్యాఖ్యలు చేసింది.
అయితే రిచా చద్దా ఎవరిని ఉద్దేశించి ఈ వ్యాఖ్యలు చేసింది అని అంతా చర్చించుకుంటున్నారు. చాలా మంది నెటిజన్లు రిచా ఈ వ్యాఖ్యలు చేసింది. అదితి రావు హైదరి గురించే అని కామెంట్స్ చేస్తున్నారు. ఆమె అదితి రావు ని టార్గెట్ చేసినట్లు స్పష్టంగా అర్థం అవుతోందని అంటున్నారు. అయితే వీళ్లిద్దరి మధ్య విభేదాలకు కారణం ఏంటో తెలియదు.
ప్రస్తుతం రిచా చద్దా నిండు గర్భవతి. జూలైలో ఆమె బిడ్డకి జన్మనివ్వబోతోంది. అలీ ఫజల్ అనే వ్యక్తిని రిచా 2022లో వివాహం చేసుకున్న సంగతి తెలిసిందే. అలీ ఫజల్ కూడా అటు హాలీవుడ్ లో ఇటు బాలీవుడ్ లో నటుడిగా రాణిస్తున్నారు.