ఆమె మరెవరో కాదు టాప్ హీరోయిన్లలో ఒకరిగా గుర్తింపు పొందిన బాలీవుడ్ నటి బర్ఖా మదన్. ప్రస్తుతం సినిమాలకి దూరంగా, డిఫరెంట్ లైఫ్ ను లీడ్ చేస్తోంది. దాదాపు 30 ఏళ్ల క్రితం, అంటే 1996లో బాలీవుడ్ లోకి అడుగు పెట్టింది బర్ఖా. అక్షయ్ కుమార్, రేఖలతో కలిసి ఖిలాడియోం కా ఖిలాడి సినిమాలో నటించింది హీరోయిన్. ఇద్దరు స్టార్స్ తో కలిసి బాలీవుడ్లోకి అడుగుపెట్టిన బర్ఖా, చాలా తక్కువటైమ్ లోనే ఇండస్ట్రీలో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంది.