స్టార్ హీరోయిన్ రష్మిక మందన టాలీవుడ్ లోకి ఛలో చిత్రంతో ఎంట్రీ ఇచ్చింది. తొలి చిత్రమే సూపర్ హిట్ కావడం, అలాగే గ్లామర్ పరంగా కూడా ఈ బెంగళూరు భామ క్లిక్ కావడంతో వరుస అవకాశాలు వచ్చాయి. గీత గోవిందం, సరిలేరు నీకెవ్వరు, భీష్మ లాంటి హిట్స్ తో రష్మిక టాలీవుడ్ లో క్రేజీ స్టార్ గా మారిపోయింది.