`యానిమల్` మూవీ ప్రమోషన్స్ లో భాగంగా నయా ట్రెండీ వేర్లో మెరుస్తుంది రష్మిక. తీరైన దుస్తులు ధరించి అందాల విందు చేస్తుంది. ఆమె కిర్రాక్ పోజులిస్తూ మతిపోగొడుతుంది. తాజాగా ఈ బ్యూటీ లైట్ పింక్ కలర్ శారీలో మెరిసింది.
స్లీవ్లెస్ బ్లౌజ్ ధరించి తన స్లీవ్ అందాలను చూపిస్తుంది. దీంతోపాటు చీరకట్టులో తన టాప్ టూ బాటమ్ వొంపులను, తన సోకులను చూపిస్తుంది. ప్రస్తుతం ఈ ఫోటోలను ఇన్స్టాగ్రామ్లో పంచుకుంది. అవి వైరల్ అవుతూ నెటిజన్లని ఆకట్టుకుంటున్నాయి.
రణ్బీర్ కపూర్, రష్మిక మందన్నా జంటగా నటిస్తున్న `యానిమల్` మూవీకి సందీప్రెడ్డి వంగా దర్శకత్వం వహించారు. అనిల్ కపూర్ తండ్రి పాత్రలో, బాబీ డియోల్ నెగటివ్ రోల్లో కనిపిస్తున్నారు. ఈ మూవీ డిసెంబర్ 1న విడుదల కానుంది. దీంతో ప్రమోషన్స్ లో బిజీగా ఉంది రష్మిక.
ఇప్పటికే హిందీలో రెండు సినిమాలు చేసింది రష్మిక మందన్నా. `గుడ్ బై` మూవీ వచ్చినట్టే తెలియకుండా వచ్చిపోయింది. `మిషన్ మజ్ను` ఎన్నో అంచనాలతో వచ్చి నిరాశ పరిచింది. దీంతో `యానిమల్`తో నార్త్ లో హిట్ అందుకోవాలని చూస్తుంది రష్మిక. ఇందులో ఆమె గీతాంజలి పాత్రలో కనిపించబోతుండటం విశేషం.
తెలుగులో రష్మిక మందన్నా `పుష్ప2`లో నటిస్తుంది. ఇందులో బన్నీకి జోడీగా పాపులర్ శ్రీవల్లి పాత్రలో నటిస్తుంది. ఇప్పటికే ఈ పాత్ర దేశాలు దాటి పాపులర్ అయ్యింది. సినిమా కూడా పెద్ద హిట్ కావడంతో దీనిపై భారీ అంచనాలున్నాయి.
దీంతోపాటు `రెయిన్బో` అనే మూవీ చేస్తుంది. అలాగే మరో రెండు తెలుగు సినిమాలకు రష్మిక సైన్ చేసినట్టు తెలిపింది. ఇటీవల ఆమె బాలయ్య హోస్ట్ గా చేస్తున్న `అన్స్టాపబుల్ విత్ ఎన్బీకే` షోలో ఈ విషయాన్ని వెల్లడించిన విషయం తెలిసిందే.
ఇదిలా ఉంటే ఆ మధ్య రష్మిక ఫోటోలు వివాదంగా మారాయి. ఓ నటి ఫేస్ని డీప్ మార్ఫింగ్ చేసి డీప్ ఫేక్ వీడియోని సోషల్ మీడియాలో వదిలారు. అది పెద్ద వివాదంగా మారడంతో దేశ వ్యాప్తంగా సంచలనంగా మారింది. దీనిపై సర్వత్రా విమర్శలు వచ్చాయి. ఈ విషయంలో రష్మికకి అంతా అండగా నిలవడం విశేషం.