హృదయ విదారకమైన ఘటన.. అల్లు అర్జున్‌ అరెస్ట్ పై `పుష్ప 2` హీరోయిన్‌ రష్మిక షాకింగ్‌ పోస్ట్

Published : Dec 13, 2024, 09:50 PM IST

అల్లు అర్జున్‌ని అరెస్ట్ ఘటన తెలుగు రాష్ట్రాలను ఉలిక్కిపాటుకు గురి చేసింది. ఈక్రమంలో ఈ ఘటనపై `పుష్ప 2` హీరోయిన్‌ రష్మిక మందన్నా స్పందించి షాకింగ్‌ పోస్ట్ పెట్టింది.   

PREV
15
హృదయ విదారకమైన ఘటన.. అల్లు అర్జున్‌ అరెస్ట్ పై `పుష్ప 2` హీరోయిన్‌ రష్మిక షాకింగ్‌ పోస్ట్

ఐకాన్‌ స్టార్‌ అల్లు అర్జున్‌ అరెస్ట్ ఈ రోజు టాలీవుడ్‌ని ఉలిక్కిపాటుకి గురి చేసింది. మధ్యాహ్నం నుంచి ఇది అందరిని కలవరానికి గురి చేస్తుంది. ప్రభుత్వం, పోలీసుల చర్య పట్ల అంతా నిరసన వ్యక్తమవుతుంది. సెలబ్రిటీలు అసహనం వ్యక్తం చేస్తున్నారు. ఒక్కరినే టార్గెట్‌ చేయడం పట్ల తీవ్ర వ్యతిరేకత వ్యక్తం చేస్తున్నారు. ఈ క్రమంలో సినిమా స్టార్స్ సోషల్‌ మీడియా ద్వారా తమ అసహనం వ్యక్తం చేస్తున్నారు. అరెస్ట్ ని ఖండిస్తున్నారు. 

బిగ్‌ బాస్‌ తెలుగు 8 అప్‌ డేట్స్ కోసం ఇక్కడ క్లిక్‌ చేయండి.
 

25

ఇప్పటికే వైఎస్‌ఆర్‌ సీపీ అధ్యక్షుడు జగన్మోహన్‌రెడ్డి స్పందించారు. తీవ్రంగా ఖండించారు. అలాగే బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌ సైతం స్పందించి హైడ్రా వివాదంలో సీఎం రేవంత్‌ రెడ్డిని కూడా అరెస్ట్ చేయాలన్నారు. మాజీ మంత్రి హరీష్‌ రావు కూడా స్పందించి ఖండించారు. మరోవైపు కేంద్ర మంత్రి బండి సంజయ్‌ కూడా స్పందించి బన్నీ అరెస్ట్ ని ఖండించారు. జాతీయ అవార్డు నటుడిని ఇలా చేయడం విచారకరం అని అసహనం వ్యక్తం చేశారు. ప్రభుత్వ అసమర్థతకు ఇది ప్రతిరూపం అంటున్నారు. 
 

35

ఈ నేపథ్యంలో `పుష్ప 2` టీమ్‌ నుంచి ఫస్ట్ టైమ్‌ హీరోయిన్‌ రష్మిక మందన్నా స్పందించింది. ఆమె నమ్మలేకపోతున్నా అంటూ ఎక్స్ లో ట్వీట్‌ చేసింది. నేను చూస్తున్నది నమ్మలేకపోతున్నాను. జరిగిన సంఘటన దురదృష్టకరం, చాలా బాధాకరమైన సంఘటన. అయితే అంతా ఒకే వ్యక్తిపై ఆరోపణలు చేయడం నిరుత్సాహపరుస్తుంది. ఈ పరిస్థితి నమ్మశక్యం కానిదిగా ఉంది. చాలా హృదయవిదారకమైన ఘటన` అంటూ విచారం వ్యక్తం చేసింది రష్మిక మందన్నా. 
 

45

అల్లు అర్జున్‌, రష్మిక మందన్నా కలిసి నటించిన `పుష్ప 2` సినిమా ఈ నెల 5న విడుదలైన విషయం తెలిసిందే. ఈ నెల 4న ప్రీమియర్స్ ప్రదర్శించారు. సంధ్య థియేటర్ లో ప్రీమియర్ షోని అభిమానుల మధ్య చూసేందుకు వెళ్లారు అల్లు అర్జున్‌, రష్మిక. కానీ అక్కడకు భారీగా అభిమానులు తరలివచ్చారు. పరిస్థితి కంట్రోల్‌ తప్పింది. తొక్కిసలాట జరిగింది.

ఈ ఘటనలో ఓ మహిళ(రేవతి) కన్నుమూసింది. ఆమె కుమారుడు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. ఈ ఘటనపై పోలీస్‌ కేసు నమోదైంది. మృతురాలు భర్త భాస్కర్‌ కేసు పెట్టిన నేపథ్యంలో ఏ 11 గా ఉన్న అల్లు అర్జున్‌ని పోలీసులు శుక్రవారం మధ్యాహ్నం అరెస్ట్ చేశారు. నాంపల్లి కోర్ట్ ఆయనకు రిమాండ్‌ విధించింది. 

55

మరోవైపు హైకోర్ట్ లో అల్లు అర్జున్‌ తరఫున న్యాయవాది క్వాష్‌ పిటీషన్‌ వేశారు. దీనిపై కోర్ట్ లో వాదోపవాదనలు జరిగాయి. ఈ క్రమంలో మధ్యంతర బెయిల్‌ని మంజూరు చేసింది హై కోర్ట్. దాదాపు రెండు వారాలపాటు బెయిల్‌పై ఉండనున్నారు. అనంతరం సాధారణ బెయిల్‌ని తెచ్చుకోవాల్సి ఉంటుంది. లేదంటే మళ్లీ అరెస్ట్ తప్పదు.

అయితే ఈ కేసులో బన్నీపై బీఎన్‌ఎస్‌ 105, బీఎన్‌ఎస్‌ 118(1)సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారు పోలీసులు. మరోవైపు థియేటర్లలో `పుష్ప 2` సినిమా దుమ్ములేపుతుంది. ఇది ఇప్పటికే వెయ్యి కోట్లు దాటింది. భారీ కలెక్షన్ల దిశగా వెళ్తున్న నేపథ్యంలో ఇలాంటి ఘటన చోటు చేసుకోవడం విచారకరం. 

read more: అల్లు అర్జున్ అరెస్ట్, వైఎస్ జగన్ ఎంట్రీతో పొలిటికల్ టర్న్! మొదలైన సరికొత్త చర్చ

also read: అల్లు అర్జున్‌ కేసులో ట్విస్ట్.. పోలీసులకు షాక్ ఇచ్చిన మృతురాలి భర్త ,హైకోర్ట్ ఏం చేసిందంటే..?

 

AR
About the Author

Aithagoni Raju

అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.Read More...
Read more Photos on
click me!

Recommended Stories