రామ్‌చరణ్‌కి జోడిగా రష్మిక.. ఆ పాత్ర చేస్తుందా?

First Published Sep 11, 2020, 2:08 PM IST

ఇండస్ట్రీలోకి వచ్చిన అతి తక్కువ టైమ్‌లోనే స్టార్‌ హీరోయిన్‌గా ఎదిగింది రష్మిక మందన్నా. బ్యాక్‌ టూ బ్యాక్‌ హిట్స్ తో క్రేజ్‌ హీరోయిన్‌ అయిపోయింది. తాజాగా ఓ క్రేజీ ప్రాజెక్ట్ లో ఎంపికైందని తెలుస్తుంది. 

ఈ ఏడాది `సరిలేరు నీకెవ్వరు`, `భీష్మ` చిత్రాలతో రెండు బ్లాక్‌ బస్టర్స్ ని తన ఖాతాలో వేసుకుంది రష్మిక మందన్నా.
undefined
మహేష్‌ సరసన నటించిన `సరిలేరు నీకెవ్వరు` కి అనిల్‌ రావిపూడి దర్శకత్వం వహించగా, యాక్షన్‌ ఎంటర్‌టైనర్‌గా సంక్రాంతి కానుకగా విడుదలై ఏకంగా రెండు వందల కోట్ల వరకు కలెక్ట్ చేసింది.
undefined
దీంతో భారీ ఆఫర్స్ ఆమె తలుపు తడుతున్నాయి. స్టార్‌ హీరోలు రష్మికాతో రొమాన్స్ చేసేందుకు ఉవ్విళ్లూరుతున్నారు. దర్శక, నిర్మాతల ఆమె డేట్స్ కోసం వెయిట్‌ చేస్తున్నారు.
undefined
ప్రస్తుతం ఈ అమ్మడు స్టయిలీష్‌ స్టార్‌ అల్లు అర్జున్‌తో `పుష్ప` చిత్రంలో నటిస్తుంది. ఇందులో రష్మిక పాత్ర డీ గ్లామర్‌గా ఉంటుందని తెలుస్తుంది. దీనికి సుకుమార్‌ దర్శకత్వం వహిస్తున్న విషయం తెలిసిందే.
undefined
దీంతోపాటు కన్నడలో `పొగరు` చిత్రంలో నటిస్తుంది. ధృవ సార్జా హీరోగా నటిస్తున్న ఈ సినిమాని బైలింగ్వల్‌గా తెరకెక్కించారు. అదే పేరుతో తెలుగులోనూ విడుదల కానుంది.
undefined
అలాగే తమిళంలో కార్తి హీరోగా రూపొందుతున్న `సుల్తాన్‌`లో మెరవబోతుంది. రష్మికకిది మొదటి తమిళ చిత్రం కావడం విశేషం.
undefined
కొత్త సినిమాల విషయంలో ఆచితూచి వ్యవహరించే రష్మికని తాజాగా తెలుగులో మరో ఆఫర్‌ వరించిందట. రామ్‌చరణ్‌తో రొమాన్స్ చేసేందుకు సిద్ధమవుతుందని సమాచారం.
undefined
చిరంజీవి హీరోగా రూపొందుతున్న `ఆచార్య` చిత్రంలో కాజల్‌ హీరోయిన్‌గా నటిస్తుంది. రామ్‌చరణ్‌ కీలక పాత్ర పోషిస్తున్నారు. ఆయనకు జోడీగా రష్మికని ఎంపిక చేసే ఆలోచనలో దర్శకుడు కొరటాల శివ ఉన్నారు.
undefined
అయితే గతంలోనే చెర్రీకి జోడిగా రష్మికని తీసుకోబోతున్నారనే వార్తలు వినిపించాయి. ఆ తర్వాత కియారా అద్వానీ, జాన్వీ కపూర్‌, అనన్య పాండే వంటి పేరు వినిపించాయి. కానీ ఫైనల్‌గా రష్మికకే ఓటు వేశారని, అందుకు ఈ టాలెంటెడ్‌ గార్ల్ కూడా సుముఖంగానే ఉన్నట్టు సమాచారం.
undefined
ఇందులో ఆమె పాత్ర నిడివి చాలా తక్కువ అని, అతిథి పాత్రకి ఎక్స్ టెండెడ్‌గా ఉంటుందని టాక్‌. మరి నిజంగానే రష్మిక ఈ పాత్ర చేస్తుందా? అన్నది చూడాలి.
undefined
click me!