మిలన్ ఫ్యాషన్ వీక్‌లో మరోసారి రష్మిక మెరుపులు, శ్రీవల్లికి దక్కిన అరుదైన అవకాశం.

First Published Sep 13, 2024, 7:40 PM IST

హీరోయిన్  రష్మిక మందన్న మిలన్ ఫ్యాషన్ వీక్ 2024లో రెండోసారి ప్రపంచ వేదికపై భారతదేశానికి ప్రాతినిధ్యం వహించనున్నారు. 

రష్మిక మందన్న

మిలన్ ఫ్యాషన్ వీక్ కోసం బయలుదేరిన రష్మిక మందన్న ఈరోజు ఉదయం విమానాశ్రయంలో అందరి దృష్టినీ ఆకర్షించారు. అందమైన , ట్రెండీ దుస్తులలో మెరిసారు. ఆమె ఫోటోగ్రాఫర్ల కోసం ఫోజులు ఇస్తూ.. తనదైన శైలిలో అందరినీ అలరించారు. 

బిగ్ బాస్ తెలుగు సీజన్ 8 అప్ డేట్స్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

రష్మిక మందన్న

గత సంవత్సరం, రష్మిక తన అద్భుతమైన నలుపు రంగు గౌనుతో అందరినీ ఆశ్చర్యపరిచారు, అభిమానులు , విమర్శకుల హృదయాలను ఒకేసారి గెలుచుకున్నారు. ఈ ఏడాది, ఆమె డ్రెస్ ఎలా  ఉంటుందో అని అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

ఆమె తన ఫ్యాషన్-ఫార్వర్డ్ లుక్‌తో ఎలా మెరిసిపోతుందో అని ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఆమె గత ప్రదర్శన అద్భుతంగా ఉంది,  ఈ సంవత్సరం ఫ్యాషన్ స్టేట్‌మెంట్ కూడా అంతే అందంగా  ఉంటుంది అని అంతా భావిస్తున్నారు. 

Latest Videos


మిలన్ ఫ్యాషన్ వీక్ 2024

“మిలన్ ఫ్యాషన్ వీక్ 2024లో ఆసియా నుండి వచ్చిన అనేక మంది ప్రముఖులతో పాటు రష్మిక రెండోసారి ప్రపంచ వేదికపై భారతదేశానికి ప్రాతినిధ్యం వహిస్తారు” అని ఫిల్మ్ ఇండస్ట్రీ వర్గాల నుంచి అందుతున్న సమాచారం. 

రష్మిక మందన్న

రష్మిక మందన్న టాలీవుడ్ తో పాటు బాలీవుడ్  సినిమా రంగంలో దూసుకుపోతున్నారు. పుష్ప 2: ది రూల్‌లో శ్రీవల్లిగా ఆమె పాత్రతో సహా, సల్మాన్ ఖాన్‌తో సికందర్, ధనుష్ మరియు నాగార్జునతో కుబేర, విక్కీ కౌశల్‌తో చావ, దేవ్ మోహన్‌తో రెయిన్‌బో, ఆయుష్మాన్ కురానాతో వాంపైర్స్ ఆఫ్ విజయ్ నగర్ మరియు రణ్‌బీర్ కపూర్‌తో యానిమల్ పార్క్ వంటి సినిమాలతో ఆమె తన సత్తా చాటుతోంది. 

click me!