ఫ్యాన్స్ కు నయనతార హెచ్చరిక, తన పోస్ట్ లు నమ్మవద్దంటూ షాకింగ్ కామెంట్స్

First Published Sep 13, 2024, 6:39 PM IST

ఫ్యాన్స్ కు షాకింగ్ న్యూస్ చెప్పింది నయనతార. తన సోషల్ మీడియా పేజ్ లో ఏవైనా పోస్ట్ లు వస్తే నమ్మవద్దంటూ... జాగ్రత్తలు చెప్పింది. కారణం ఏంటంటే..? 

కేరళలో పుట్టిన నయనతార చిన్నవయసులోనే మలయాళ టీవీ ఛానెల్స్‌లో యాంకర్‌గా పనిచేసింది. ఆ తరువాత,  మలయాళ చిత్రాలలో నటించడం ప్రారంభించారు నయన్. కాని నయనతార మొదటి కోలీవుడ్ అవకాశం ప్రముఖ స్టార్  శరత్‌కుమార్‌తో వచ్చింది. 

2005 సంవత్సరంలో విడుదలైన "అయ్యా" చిత్రం ఆమె ఫస్ట్ మూీ.  ఆ సినిమా తర్వాత తన రెండో సినిమా చంద్రముఖిలో సూపర్‌స్టార్‌ రజనీకాంత్‌కి హీరోయిన్‌గా అవకాశం వచ్చింది. 

తమిళ చిత్ర పరిశ్రమలో మెల్లగా ఎన్నో మంచి చిత్రాల్లో నటించడం ప్రారంభించిన నటి నయనతార చాలా తక్కువ కాలంలోనే కమల్ మినహా దాదాపు తెలుగు, తమిళ చిత్రసీమలోని ప్రముఖ నటీనటులందరితోనూ నటించింది. 

దాదాపు 20 ఏళ్ళుగా  హీరోయిన్ గా కోనసాగుతూ..   నయనతార లేడీ సూపర్ స్టార్ స్థాయికి ఎదగింది. రిసెంట్ గా నయనతార  75వ సినిమా రిలీజ్ అయ్యింది. 

బిగ్ బాస్ తెలుగు సీజన్ 8 అప్ డేట్స్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

రీసెంట్ గా  అన్నపూరణి సినిమాతో ఆడియన్స్ ముందుకు వచ్చింది నయన్. ఈసినిమాలో బ్రాహ్మణ గృహిణి పాత్రలో నటించిన నయనతార, ఆ సినిమాలో ఓ పార్టీలో వంట చేసే ముందు బురఖా ధరించి ప్రార్థనలు చేసే సన్నివేశంలో నటించి పలు వివాదాల్లో చిక్కుకుంది. 

ఓటీటీలో విడుదలైన అన్నపురాణిని దాని నుంచి తీసేసే స్థాయికి సమస్య పెరిగిపోయింది. అదేవిధంగా 2011లో ప్రముఖ నటుడు ప్రభుదేవాతో నయనతార జతకట్టనున్నట్లు ప్రచారం జరిగింది. 

గతంలో నయనతార ప్రభుదేవా ప్రేమ ఎంత వరకూ వెళ్ళిందంటే.. ప్రభు  తన భార్య కి విడాకులు ఇచ్చే వరకు సమస్య ముదిరింది. ఇక పరభుదేవకంటే ముందు  ప్రముఖ నటుడు శింబుతో నయనతార ప్రేమాయణం సాగిస్తోందని గతంలో వార్తలు వచ్చాయి.

మహేష్ బాబు ఫ్యాన్స్ కు రాజమౌళి స్ట్రాంగ్ వార్నింగ్

Latest Videos


గత 19 ఏళ్లుగా ఎన్నో వివాదాలను ఎదుర్కొన్న నయనతార ప్రస్తుతం ఒక్కో సినిమాకు దాదాపు 10 నుంచి 12 కోట్ల రూపాయల వరకు సంపాదిస్తోంది. చాలా కాలంగా ఒంటరిగా ఉన్న నయన్ 2022లో ప్రముఖ దర్శకుడు విఘ్నేష్ శివన్‌ను ప్రేమించి పెళ్లి చేసుకుంది.

ఆ తర్వాత సంవత్సరం సరోగసి ద్వారా ఈ జంట కవల మగపిల్లలకు జన్మనిచ్చింది నయనతార. ఈ విషయంలో కూడా కొంత వివాదం ఉన్నప్పటికీ, కొన్ని రోజుల తరువాత  సమస్యలు తొలగిపోయాయి.

నయనతార ప్రస్తుతం తన భర్తతో కలిసి సింగపూర్ కంపెనీలో వ్యాపారం చేస్తోంది. ఆమె ఫెమీ9 పేరుతో మహిళల కోసం న్యాపీలు మరియు ఇతర సౌందర్య ఉత్పత్తులను విక్రయిస్తుంది.

దానికి నయనతార కూడా మోడల్‌ కావడం గమనార్హం. ఓ వైపు సినిమా, మరోవైపు వ్యాపారంలో బిజీ బిజీగా ఉంది నయన్. ఈక్రమంలో నయనతారకు సంధించిన ఓ విషయం వైరల్ అవుతోంది. 

నయనతార తన ట్విట్టర్ మరియు ఇన్‌స్టాగ్రామ్ పేజీలలో చాలా యాక్టివ్ గా ఉంటారు.  తమ సోషల్ మీడియా పేజ్ లలో ఆమె  తన కంపెనీ ఉత్పత్తుల గురించి ఎప్పటికప్పుడు అప్ డేట్స్ ఇస్తూ ఉంటారు. 

ఇక తాజాగా ఆమె ట్విట్టర్ పేజీలో దాదాపు 3.3 మిలియన్ల మంది ఫాలోవర్లను కలిగి ఉన్న నయనతార అకౌంట్.. హ్యాక్ చేయబడింది. ఈ విషయాన్ని తన ట్విట్టర్ పేజీ ద్వారా అభిమానులకు తెలియజేశాడు. 

ఏదైనా అవాంఛిత ట్వీట్లు లేదా అనుమానాస్పద విషయాలు పోస్ట్ చేస్తే, దయచేసి నమ్మవద్దని నటి నయనతార అభ్యర్థించారు.  

click me!