‘అందరికీ నేను నచ్చాలనేం లేదు’.. ట్రోల్స్ పై రష్మిక మందన్న క్లారిటీ!

First Published Jan 7, 2023, 2:12 PM IST

నేషనల్ క్రష్ రష్మిక మందన్న (Rashmika Mandanna) రీసెంట్ గా తను చేసిన కామెంట్స్ తో ట్రోల్స్ కు గురవుతున్న విషయం తెలిసిందే. తనపై వస్తున్న వ్యతిరేకతపై తాజాగా స్పందిస్తూ క్లారిటీ ఇచ్చింది.  
 

టాలీవుడ్ స్టార్ హీరోయిన్ గా దూసుకెళ్తున్న రష్మిక మందన్న ప్రస్తుతం బాలీవుడ్ లో బ్యాక్ టు బ్యాక్ సినిమాలతో అలరిస్తున్న విషయం తెలిసిందే. సౌత్ తో పాటు నార్త్ చిత్రాల్లోనూ నటిస్తూ బిజీగా ఉంటోందీ కుర్ర భామ. అయితే కొద్దిరోజులుగా ఈ బ్యూటీ తీవ్రంగా ట్రోల్స్ కు గురవుతోంది.
 

గతంలో ‘కేజీఎఫ్’ నిర్మాణ సంస్థ హోంబాలే ఫిల్మ్స్ నిర్మించిన ‘కాంతార’ చిత్రం, నటుడు రిషబ్ శెట్టిపైనా షాకింగ్ కామెంట్స్ చేసింది. కన్నడకు చెందిన ఈ బ్యూటీ అక్కడి నిర్మాణ సంస్థ పేరు చెప్పడానికి ఇబ్బంది పడటం హాట్ టాపిక్ గా మారింది.

దీంతో కన్నడ పరిశ్రమలోని ప్రముఖులతో  పాటు కన్నడీగుల నుంచి తీవ్ర వ్యతిరేకతను ఎదుర్కొంటోంది. కొద్దిరోజుల కింద రష్మిక సాండల్ వుడ్ లో బ్యాన్ చేసినట్టు కూడా ప్రచారం జరిగింది. ఇక రీసెంట్ గా తన నెక్ట్స్ ఫిల్మ్ ‘మిషన్ మజ్ను’ చిత్ర ప్రీ రిలీజ్ ఈవెంట్ లోనూ సౌత్ సినిమా పాటలపై షాకింగ్ కామెంట్స్ చేసింది.
 

సౌత్ సినిమాల్లో కేవలం మాస్ సాంగ్సే ఉంటాయని వివాదస్పదగా మాట్లాడింది. ఇలా వరుస కామెంట్లతో రష్మిక ట్రోల్స్ కు గురవుతూనే ఉంది. ఇక ప్రస్తుతం తను నటించిన చిత్రాల ప్రచార కార్యక్రమాల్లో పాల్గొంటున్న రష్మిక తాజాగా ట్రోల్స్ పై స్పందించింది.
 

తాజాగా ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. ‘నేను యాక్ట్రెస్ అయినంత మాత్రానా.. అందరికీ నేను నచ్చాలనేం లేదు. ప్రేమతో పాటు ఇక్కడ ద్వేషం కూడా ఉంటుంది. నేను సెలబ్రేటీని కావడంతో కొందరికీ నా తీరు నచ్చకపోవచ్చు. ఎవరైనా నన్ను ఇష్టపడుతారో వారి పట్ల క్రుతజ్ఞురాలిగా ఉంటాను.’ అంటూ క్లారిటీ ఇచ్చింది. 

ఇక రష్మిక చేతిలో ప్రస్తుతం భారీ ప్రాజెక్ట్స్ ఉన్నాయి. హిందీలో Mission Majnu రిలీజ్ కు సిద్దంగా ఉంది. జనవరి 20న నెట్ ఫ్లిక్స్ లో విడుదల కానుంది. ప్రస్తుతం చిత్ర ప్రమోషన్స్ లో బిజీగా ఉంది. తెలుగులో రూపుదిద్దుకుంటున్న ‘వరిసు’ కూడా జనవరి 11న ప్రేక్షకుల ముందుకు రానుంది. మరోవైపు ‘యానిమల్’లో, ‘పుష్ప ది రూల్’లో నటిస్తూ బిజీగా ఉంది. 

click me!