కొప్పున పూలెట్టుకుని కేక పెట్టిస్తున్న బన్నీ భామ.. రష్మిక చేసిన చిలిపి పనికి ఫిదా అవుతున్న నెటిజన్లు..

First Published Aug 17, 2021, 7:43 PM IST

రష్మిక మందన్నా నేషనల్‌ క్రష్‌. కోట్లాది మంది అభిమానుల కలల రాణి. జెట్‌ స్పీడ్‌తో శాండల్‌వుడ్‌ నుంచి బాలీవుడ్‌కి దూసుకెళ్లిన సునామీ. టాలెంట్‌కి కేరాఫ్‌ అయిన ఈ అందాల భామ తాజాగా చేసిన చిలిపి పనికి ఫ్యాన్స్ ఫిదా అవుతున్నారు. 
 

రష్మిక మందన్నా ఇప్పుడు అభిమానులను షాకిస్తుంది. కొప్పున పూలు పెట్టుకుని పోజులిచ్చింది. చైర్‌లో కూర్చొని చిలిపిగా ఈ అమ్మడు చేసిన పనికి నెటిజన్లు ఫిదా అవుతున్నారు. 

మల్లెపూలు కొన్ని మూరలు తీసుకుని నెత్తిన పెట్టుకుని పోజులిచ్చింది రష్మిక. అంతేకాదు ఈ పిక్స్ ని ఇన్‌స్టాలో అభిమానులతో పంచుకోగా ట్రెండింగ్‌ అవుతున్నాయి. 

ఈ సందర్భంగా రష్మిక చెబుతూ, మీకు నచ్చినదాన్ని తీసుకోండి. నా సినిమా షాట్ల మధ్య నేను ఖాళీగా ఉన్నప్పుడు జాబ్‌ లేకుండా ఉన్నప్పుడు ఇదే పనిచేస్తానని చెప్పింది రష్మిక. 

ఈ పోస్ట్ ఇప్పుడు వైరల్‌ అవుతుంది. ఏ పనిలేకపోతే రష్మిక పూలమ్ముకుంటుందా? అంటూ నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు. ఎంతో పెద్ద స్టార్ అయి ఉండి ఇలా చిలిపిగా వ్యవహరించడం ఆమె కల్మషం లేని
తత్వానికి నిదర్శమని ఫిదా అవుతున్నారు అభిమానులు. 

మొత్తంగా రష్మిక చేసిన ఈ చిలిపి పని వైరల్‌గా మారింది. అయితే ఈ సందర్భంగా రష్మిక చీరకట్టులో ఉండటం విశేషం. దీంతో మరింతగా ఆకట్టుకుంటుందీ అందాల భామ. 

రష్మిక మందన్నా ప్రస్తుతం తెలుగు, కన్నడ, హిందీలో సినిమాలు చేస్తూ దూసుకుపోతుంది. తెలుగులో బన్నీ సరసన `పుష్ప` చిత్రంలో నటిస్తుంది.

అలాగే శర్వానంద్‌తో `ఆడవాళ్లు మీకు జోహార్లు` సినిమా చేస్తుంది. హిందీలో `మిషన్‌ మజ్ను`, `గుడ్‌బై`తోపాటు మరో సినిమా చేస్తూ బిజీగా ఉంది రష్మిక. 

click me!