రష్మిక మందన్న, విజయ్ దేవరకొండ జపాన్లో కలిసి హాలిడేస్ ఎంజాయ్ చేస్తున్నారా? పెళ్లి తర్వాత ఈ జంట వెకేషన్ ఇప్పుడు హాట్ టాపిక్గా మారిందా? 'రణబలి' సినిమాతో ఈ సూపర్ హిట్ జోడీ మళ్లీ తెరపై మ్యాజిక్ చేయబోతోందా?
యానిమే అవార్డ్స్లో పాల్గొన్న తర్వాత రష్మిక మందన్న జపాన్ ట్రిప్ ఫోటోలు, వీడియోలను షేర్ చేసి ఇంటర్నెట్లో సంచలనం సృష్టించారు. ఆమె ట్రెడిషనల్ యుకాటా లుక్, జపనీస్ ఫుడ్, ముఖ్యంగా విజయ్ దేవరకొండ కనిపించడం అభిమానులను ఆకట్టుకుంది.
27
రష్మిక మందన్న షేర్ చేసిన జపాన్ ట్రిప్ ఫోటోలు
రష్మిక మందన్న తన ఇన్స్టాగ్రామ్లో జపాన్ ట్రిప్ ఫోటోలు, వీడియోలు షేర్ చేశారు. 'ఈ ఏడాది జపాన్ ట్రిప్ మరింత సరదాగా ఉంది!' అని ఆమె పోస్ట్కు క్యాప్షన్ ఇచ్చారు. ఈ ఫోటోల్లో ఆమె జపాన్ వీధుల్లో తిరుగుతూ, అక్కడి కల్చర్, ఫుడ్ను ఎంజాయ్ చేస్తూ కనిపించారు.
37
యుకాటా లుక్లో అదరగొట్టిన రష్మిక మందన్న
జపాన్లో రష్మిక ట్రెడిషనల్ జపనీస్ డ్రెస్ 'యుకాటా'లో కనిపించారు. ఇది తేలికపాటి కిమోనో లాంటిది. ఆమె డ్రెస్పై ఆరెంజ్, పసుపు రంగు సన్ఫ్లవర్స్, ఆకుపచ్చ ఆకుల డిజైన్ ఉంది. నడుముకు నల్లటి ఓబీ బెల్ట్, చేతికి గోల్డ్ బ్రాస్లెట్తో ఆమె లుక్ మరింత ప్రత్యేకంగా మారింది.
ఒక వీడియోలో రష్మిక నియాన్ రంగుల్లో ఉన్న గుండ్రని రాళ్ల లాంటి నిర్మాణాల మధ్య సరదాగా ఆడుకుంటూ కనిపించారు. ఆమె అల్లరి చేష్టలు, నవ్వులు ఈ వీడియోకు హైలైట్గా నిలిచాయి. ఇతర ఫోటోల్లో ఆమె జపాన్లోని అందమైన ప్రదేశాల్లో తిరుగుతూ, అక్కడి వాతావరణాన్ని ఆస్వాదిస్తూ కనిపించారు.
57
భర్తని కనిపించకుండా దాచేసిన రష్మిక
ఈ పోస్ట్ మొత్తానికే హైలైట్ ఏంటంటే.. రరష్మిక తన భర్త విజయ్ దేవరకొండని కనిపించకుండా దాచేసింది. ముఖం కనిపించకుండా ఫోటోలు షేర్ చేసింది. దీంతో ఆమె ఈ ట్రిప్కు ఒంటరిగా వెళ్లలేదని స్పష్టమైంది. ఫోటోలు క్లారిటీగా లేకపోయినా, అభిమనులు వెంటనే విజయ్ను గుర్తుపట్టేశారు.
67
పెళ్లి తర్వాత నిత్యం వార్తల్లో రష్మిక-విజయ్
రష్మిక, విజయ్ ఈ ఏడాది ఫిబ్రవరి 26న ఉదయ్పూర్లో పెళ్లి చేసుకున్నారు. ఆ తర్వాత హైదరాబాద్లో జరిగిన రిసెప్షన్కు రామ్ చరణ్, నాని, కరణ్ జోహార్, కృతి సనన్, అల్లు అర్జున్తో పాటు పలువురు సినీ తారలు హాజరయ్యారు. పెళ్లి తర్వాత ఈ జంట తరచూ వార్తల్లో నిలుస్తోంది. ఇటీవల ఎయిర్పోర్ట్లో విజయ్ మెడలోని 'R' అక్షరం ఉన్న పెండెంట్ కూడా అందరి దృష్టిని ఆకర్షించింది.
77
మళ్లీ వెండితెరపై రష్మిక-విజయ్ జోడీ
ఇక సినిమాల విషయానికొస్తే, పెళ్లి తర్వాత రష్మిక, విజయ్ మొదటిసారిగా 'రణబలి' సినిమాలో కలిసి నటించబోతున్నారు. ఇది వీరిద్దరి కాంబినేషన్లో వస్తున్న మూడో సినిమా. రాహుల్ సాంకృత్యన్ దర్శకత్వం వహించిన ఈ సినిమా 1854 నుంచి 1878 మధ్య కాలం నాటి కథతో తెరకెక్కుతోంది. సెప్టెంబర్ 11న ఈ సినిమా థియేటర్లలో విడుదల కానుంది. విజయ్ 'VDxShouryuv'లో నటిస్తుండగా, రష్మిక చేతిలో 'కాక్టెయిల్ 2', 'మైసా' వంటి సినిమాలు ఉన్నాయి.