ముంబై నగరంలోని ఖరీదైన ప్రాంతమైన బాంద్రాలో వీరికి ఒక ఇల్లు ఉంది. ఆ ఇంటి విలువ ఏకంగా 250 కోట్లు. ఈ ఆస్తి మొదటగా రాజ్ కపూర్ నుంచి రిషి కపూర్, తర్వాత రణబీర్ కపూర్ కి వారసత్వంగా వచ్చింది. గత సంవత్సరంలో ఈ బిల్డింగ్ను రణబీర్ పూర్తిగా రీ మోడలింగ్ చేయించారు. ఇది ఆరు అంతస్థుల లగ్జరీ బిల్డింగ్గా మారింది. అత్యాధునిక సదుపాయాలతో నిర్మితమైన ఈ భవనంలో అన్ని వసతులు ఉండేలా రూపొందించబడింది.