మీడియా దిగ్గజం రామోజీ రావు శనివారం రోజు తెల్లవారు జామున తుదిశ్వాస విడిచారు. 88 ఏళ్ళ వయసులో వృద్ధాప్య సమస్యలు, అనారోగ్యంతో బాధపడుతున్న రామోజీ రావు ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మరణించారు. పారిశ్రామిక వేత్తగా, మీడియా రంగంలో ఆయన ఉన్నత శిఖరాలకు చేరుకున్నారు. 2016లో భారత ప్రభుత్వం ఆయన్ని పద్మ విభూషణ్ అవార్డుతో సత్కరించింది.