నితీశ్ తివారీ 'రామాయణం' ట్రైలర్ కోసం ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న అభిమానులకు నిరాశ. ట్రైలర్ రిలీజ్కు కొన్ని గంటల ముందు వాయిదా వేస్తున్నట్లు నిర్మాత నమిత్ మల్హోత్రా ప్రకటించారు.
నితీశ్ తివారీ 'రామాయణం' ఫస్ట్ లుక్ కోసం ఎదురుచూస్తున్న అభిమానుల కు మరికొంత కాలం ఆగాల్సిందే. శాన్ డియాగో కామిక్-కాన్లో ట్రైలర్ లాంచ్కు కొన్ని గంటల ముందు, రిలీజ్ను వాయిదా వేస్తున్నట్లు నిర్మాత నమిత్ మల్హోత్రా ప్రకటించారు. సోనీ పిక్చర్స్ ఎంటర్టైన్మెంట్తో భాగస్వామ్యం కుదిరినందుకే ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఆయన ఇన్స్టాగ్రామ్లో తెలిపారు. ఈ సినిమాకు ప్రపంచవ్యాప్తంగా ఒకేసారి గ్రాండ్ ఇంట్రడక్షన్ ఇచ్చేందుకు, ట్రైలర్ను త్వరలో రిలీజ్ చేస్తామన్నారు. ఇది భారతీయ సినిమాకు గర్వకారణమని, హాలీవుడ్ రేంజ్లో మన పురాణ గాథను అంతర్జాతీయ ప్రేక్షకులకు చూపిస్తామని మల్హోత్రా చెప్పారు. అభిమానుల సపోర్ట్కు ఆయన ధన్యవాదాలు తెలిపారు.
23
రూ.4,000 కోట్ల భారీ బడ్జెట్
రామాయణం సినిమాను రెండు భాగాలుగా, సుమారు రూ.4,000 కోట్ల భారీ బడ్జెట్తో నిర్మిస్తున్నారు. ఈ ప్రాజెక్ట్ గురించి నమిత్ మల్హోత్రా గతంలో మాట్లాడుతూ, ఆరేళ్లుగా ఈ సినిమాపై పని చేస్తున్నామని, మొదట్లో చాలామంది ఇది సాధ్యం కాదనుకున్నారని చెప్పారు. రెండు భాగాల నిర్మాణ వ్యయం దాదాపు 500 మిలియన్ డాలర్లు అని, ఇది భారతీయ సినిమాలో అతిపెద్ద ప్రాజెక్టులలో ఒకటని ఆయన వివరించారు. ఇంత పెద్ద బడ్జెట్ అయినా, ఆర్థిక క్రమశిక్షణతో ప్రపంచస్థాయి సినిమాను తీయడమే తమ లక్ష్యమని మల్హోత్రా తెలిపారు.
33
నితీశ్ తివారీ దర్శకత్వం
ఈ సినిమాకు ఆస్కార్ విజేతలు ఏఆర్ రెహమాన్, హన్స్ జిమ్మర్ మొదటిసారి కలిసి పనిచేస్తున్నారు. ఈ ప్రాజెక్ట్ ఎంతో థ్రిల్లింగ్గా, ఛాలెంజింగ్గా ఉందని రెహమాన్ ఇటీవల అన్నారు. భారతీయులకు సుపరిచితమైన కథకు కొత్త తరహా సంగీతం అందిస్తూనే, ప్రపంచ ప్రేక్షకులను ఆకట్టుకునేలా ప్రయత్నిస్తున్నామని ఆయన చెప్పారు. నితీశ్ తివారీ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో రణ్బీర్ కపూర్, సాయి పల్లవి, యశ్, సన్నీ డియోల్, రవి దూబే కీలక పాత్రల్లో నటిస్తున్నారు. ఈ సినిమా మొదటి భాగం 2026 దీపావళికి, రెండో భాగం 2027 దీపావళికి ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది.