రామ్ చరణ్ ప్రస్తుతం గ్లొబల్ స్టార్... హాలీవుడ్ రేంజ్ లో అతని ఇమేజ్ ఎగబాకింది. ఒకప్పుడు టాలీవుడ్ కే పరిమితం అయిన రామ్ చరణ్ కు ఇప్పుడు దేశ వ్యాప్తంగా అభిమానులు ఉన్నారు. ఇప్పటికే బాలీవుడ్ ఇండస్ట్రీలో ఊహించని స్థాయిలో క్రేజ్ సంపాదించిన చరణ్.. తాజాగా లోకనయాకుడు కమల్ హాసన్ కు కూడా షాక్ ఇచ్చాడు.
రామ్ చరణ్ తాజా మూవీ గేమ్ ఛేంజర్ ఈ ఏడాది సెకండాఫ్ లో రిలీజ్ కు రెడీ అవుతోంది. మోస్ట్లీ.. నవంబర్ లో ఆసినిమా పాన్ ఇండియా లెవల్లో రిలీజ్ అయ్యే అవకాశం ఉంది. అయితే ఈసినిమా హక్కులకు సబంధించిన న్యూస్ ప్రస్తుతం వైరల్ అవుతోంది. గేమ్ ఛేంజర్ సినిమా నార్త్ ఇండియా హక్కులు 75 కోట్లకు అమ్ముడయ్యాయని వార్త వైరల్ అవుతోంది.
ఇళయరాజా గొప్పవారేమీ కాదు..మద్రాస్ హైకోర్టు సంచలన వ్యాఖ్యలు
#Indian2
అదే సమయంలో రిలీజ్ కాబోతున్నకమల్ హాసన్ ఇండియన్2 హక్కులు కూడా అమ్ముడు పోయాయని తెలుస్తోంది. అయితే సినిమా నార్త్ ఇండియా హక్కులు 20 కోట్ల రూపాయలకు అమ్ముడయ్యాడన్న టాక్ నడుస్తోంది. ఇండియన్2 నార్త్ రైట్స్ తో పోలిస్తే దాదాపుగా 4 రెట్లు ఎక్కువ మొత్తానికి గేమ్ ఛేంజర్ హక్కులు అమ్ముడవడం ప్రస్తుతం హాట్ టాపిక్ అవుతోంది.
హీరో విజయ్ కి ప్రమాదం, గాయాలతో ఓటు వేయడానికి వచ్చిన దళపతి,
ఈ రెండు సినిమాలకు దర్శకుడు శంకర్ కావడం విశేషం. దాంతో ప్రస్తుతం ఈ విషయం హాట్ టాపిక్ అవుతోంది. రామ్ చరణ్ క్రేజ్ చూసి ఇండస్ట్రీ లో అంతా షాక్ అవుతున్నారు. అంతే కాదు అంత సీనియారిటీ ఉన్న స్టార్ హీరో సినిమాకు పోటీ వెళ్ళడంతో పాటు.. మూడు రెట్లు ఎక్కువగా బిజినెస్ అవ్వడంపై అంతా ఆశ్చర్యం వ్యక్తం అవుతోంది.
శ్రీదేవి డెత్ మిస్టరీ.. బయటపడ్డ అసలు నిజం....? కారణం అదేనా..?