కూలీ తర్వాత లోకేష్ కనకరాజ్ ఖైదీ 2 సినిమా తీస్తారని అనుకున్నారు, కానీ ఇప్పుడు వేరే సినిమా చేస్తున్నట్టు తెలుస్తోంది. ఆ సినిమాలో రజినీకాంత్, కమల్ హాసన్ కలిసి నటిస్తున్నారట. ఈ సినిమాని కమల్ హాసన్ రాజ్ కమల్ ఫిలిమ్స్, ఉదయనిధి స్టాలిన్ రెడ్ జెయింట్ మూవీస్ కలిసి నిర్మిస్తున్నారని సమాచారం. అయితే ఈ విషయంలో అఫీషియల్ గా అనౌన్స్ మెంట్ మాత్రం రాలేదు. ఇది నిజమైతే తమిళంతో పాటు సౌత్ లో ఈ సినిమా ఒక మైలురాయిగా నిలుస్తుంది.