భార్యని అలా చేయబోయి ఇంత ఘోరం జరిగిందా, 5 నెలల గర్భం.. సంపత్ మృతిపై అనుమానాలు పెంచుతున్న స్నేహితుడు

First Published Apr 26, 2023, 12:52 PM IST

రాజేష్ చేసిన తాజా ప్రకటన ప్రస్తుతం అందరిలో అనుమానాలు పెంచుతోంది. సంపత్ మృతిపై మరిన్ని డౌట్లు క్రియేట్ అయ్యేలా చేసింది. ఒక రకంగా ఈ స్టేట్మెంట్ కన్నడ చిత్ర పరిశ్రమలో ప్రకంపనలు రేపుతోంది అనే చెప్పాలి. 

చిత్ర పరిశ్రమలో విషాదాల పర్వం కొనసాగుతున్న నేపథ్యంలో శనివారం రోజు బుల్లితెర నటుడు సంపత్ సూసైడ్ చేసుకున్న సంగతి తెలిసిందే. కేవలం 35 ఏళ్ళ వయసులోనే సంపత్ తిరిగిరాని లోకాలకు వెళ్లారు. దీనితో కుటుంబ సభ్యులు, స్నేహితులు, సన్నిహితులు విషాదంలో మునిగిపోయారు. 

ఆదివారం రోజు సంపత్ అంత్యక్రియలు అతడి స్వగ్రామం రాజనరసింహ పురంలో జరిగాయి. బెంగుళూరుకి సమీపంలో నేలమంగళలో ఉన్న తన నివాసంలో సంపత్ ఆత్మహత్య చేసుకున్నట్లు కుటుంబ సభ్యులు ప్రకటించారు. అయితే సంపత్ ఎలా సూసైడ్ చేసుకున్నారు అనేది క్లారిటీ లేదు.

Latest Videos


అయితే ముందుగా సంపత్ చిత్ర పరిశ్రమలో అవకాశాలు లేకపోవడంతోనే డిప్రెషన్ కి గురై ఆత్మహత్య చేసుకున్నట్లు కథనాలు వచ్చాయి. కుటుంబ సభ్యులు మాత్రం ఎలాంటి వివరణ ఇవ్వలేదు. తాజాగా సంపత్ స్నేహితుడు రాజేష్ ధృవ సంచలన ప్రకటన చేస్తూ వీడియో సందేశం ఇచ్చారు. ముందుగా రాజేష్.. సంపత్ మృతికి ఎమోషనల్ గా స్పందించారు. సంపత్ మృతిపై సోషల్ మీడియాలో అనేక కథనాలు వస్తుండడంతో రాజేష్ స్వయంగా స్పందించి మరో షాకింగ్ విషయాన్ని రివీల్ చేశాడు. 

సంపత్ భార్య ప్రస్తుతం 5 నెలల గర్భవతి అట. కొంతకాలంగా సంపత్ కి, అతడి భార్యకి మధ్య విభేదాలు తలెత్తినట్లు రాజేష్ తెలిపాడు. సంపత్ కి అతడి భార్యకి 12 ఏళ్ల నుంచి స్నేహం ఉంది. దీనితో వారిద్దరూ ఇష్టపడి వివాహం చేసుకున్నారట. కొంతలంగా తలెత్తిన విభేదాల వాళ్ళ సంపత్ తన భార్యని బెదిరించేందుకు ఫ్రాంక్ సూసైడ్ ప్లాన్ చేశాడు. ఉరివేసుకున్నట్లు ఫ్రాంక్ చేసి తన భార్యని బెదిరించాలనుకున్నాడు. కానీ ప్రమాదవశాత్తూ ఉరితాడు గొంతుకు గట్టిగా బిగిసుకుపోవడంతో సంపత్ మరణించినట్లు రాజేష్ సంచలన ప్రకటన చేశారు. 

సంపత్ డిప్రెషన్ తో మరణించినట్లు అసత్య ప్రచారం చేయొద్దని రాజేష్ నెటిజన్లని రిక్వస్ట్ చేశాడు. రాజేష్ చేసిన తాజా ప్రకటన ప్రస్తుతం అందరిలో అనుమానాలు పెంచుతోంది. సంపత్ మృతిపై మరిన్ని డౌట్లు క్రియేట్ అయ్యేలా చేసింది. ఒక రకంగా ఈ స్టేట్మెంట్ కన్నడ చిత్ర పరిశ్రమలో ప్రకంపనలు రేపుతోంది అనే చెప్పాలి. 

మొదట డిప్రెషన్ అన్నారు.. ఇప్పుడు ఫ్రాంక్ అంటున్నారు.. ఫ్రాంక్ చేయబోయే నిజంగా సంపత్ మరణించాడా ? ఇలా అనేక అనుమానాలు మొదలయ్యాయి. మరి పోలీసులు ఈ కేసుని ఏ కోణంలో దర్యాప్తు చేస్తారో చూడాలి. నటుడు సంపత్ అగ్నిసాక్షి టివి సీరియల్ తో మంచి గుర్తింపు పొందాడు. జేష్ ధృవ దర్శకత్వంలో సంపత్ 'శ్రీ బాలాజీ ఫోటో స్టూడియో' అనే చిత్రంలో నటించారు. 

సంపత్ మరణవార్తని తెలియజేస్తూ అతడి స్నేహితుడు, నటుడు అయిన రాజేష్ ధృవ ఎమోషనల్ పోస్ట్ పెట్టారు. 'నీ పోరాటం ఇప్పుడే ఆగిపోకూడదు. నువ్వు చాలా సినిమాలు చేయాలి. నీ కలని సాకారం చేసుకునేందుకు ఇంకా చాలా సమయం ఉంది.. తిరిగి రా మిత్రమా' అంటూ రాజేష్ దృవ భావోద్వేగానికి గురయ్యారు. ఇప్పుడు తాజాగా రాజేష్ తన స్నేహితుడు మృతికి ఫ్రాంక్ కారణం అని స్టేట్మెంట్ ఇచ్చాడు. 

click me!