ఆ తర్వాత రాజశేఖర్ని ఎదుగుదలని, ఆయనకు ఆడియెన్స్ నుంచి వస్తోన్న స్పందన చూసిన నిర్మాత పోకూరి బాబూరావు రియలైజ్ అయ్యాడు. రాజశేఖర్తోనే సినిమాలు తీసేందుకు ముందుకు వచ్చాడు. అలా తన `ఈతరం ఫిల్మ్స్`ని స్థాపించి పలు విజయవంతమైన సినిమాలు చేశారు.
రాజశేఖర్తోనే ఐదారు చిత్రాలు నిర్మించారు. వాటిలో చాలా వరకు అన్నీ పెద్ద హిట్స్. రాజశేఖర్ కెరీర్ లో బిగ్గెస్ట్ హిట్గా నిలిచిన `అన్న` మూవీని ఆయనే నిర్మించారు. ఆ సినిమా 1994లో వచ్చి ఆకట్టుకుంది. దీంతోపాటు `మా ఆయన బంగారం`, `ఎర్ర మందారం` వంటి చిత్రాలు చేశారు. తనని అవమానించిన నిర్మాతకు బ్యానర్ గర్వపడే చిత్రాలను ఇచ్చారు రాజశేఖర్.