గతంలో టాలీవుడ్ లో అనేక మల్టీస్టారర్ చిత్రాలు వచ్చేవి. ఎన్టీఆర్, ఏఎన్ఆర్, సూపర్ స్టార్ కృష్ణ, కృష్ణంరాజు, శోభన్ బాబు లాంటి అగ్ర హీరోలు అనేక మల్టీస్టారర్ చిత్రాల్లో నటించారు. వీరి హయాం తర్వాత మల్టీస్టారర్ చిత్రాలు నెమ్మదిగా తగ్గుతూ వచ్చాయి. గతంలో యాంగ్రీ హీరో రాజశేఖర్, కలెక్షన్ కింగ్ మోహన్ బాబు ఓ మల్టీస్టారర్ చిత్రంలో నటించాల్సింది.