ఈ నేపథ్యంలో, ఇటీవల జరిగిన "పుష్ప 2" ఘటనను గుర్తు చేసుకుంటూ, భద్రత దృష్ట్యా థియేటర్ యాజమాన్యం హరి హర వీర మల్లు ట్రైలర్ స్క్రీనింగ్ను రద్దు చేస్తున్నట్లు ప్రకటించింది. అయితే, నగరంలోని షెడ్యూల్ చేయబడిన ఇతర థియేటర్స్ లలో ట్రైలర్ షో యథావిధిగా కొనసాగుతుంది.
పుష్ప 2 రిలీజ్ సమయంలో అల్లు అర్జున్ సంధ్య థియేటర్ కి వెళ్ళినప్పుడు విషాదకర సంఘటన చోటు చేసుకుంది. అలాంటి సంఘటన జరగకుండా ముందు జాగ్రత్తగా థియేటర్ యాజమాన్యం, పోలీసులు ట్రైలర్ ప్రదర్శన క్యాన్సిల్ చేయాలని నిర్ణయించారు. ఈ చిత్రంలో నిధి అగర్వాల్ హీరోయిన్గా నటించగా, సంగీతాన్ని ఎం.ఎం. కీరవాణి అందిస్తున్నారు.